పాన్ ఇండియా స్టార్ గా బాహుబలి సినిమా తో స్టాంప్ ఏపీ చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సినిమా దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ కావడంతో  అనేక రికార్డు సృష్టించడంతో ప్రపంచ సినిమా ప్రముఖులు బాహుబలి సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేయడంతో ఓల్డ్ వైడ్ గా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది అదేవిధంగా మార్కెట్ కూడా క్రియేట్ అయ్యింది. ఇటువంటి తరుణంలో ప్రభాస్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా తీస్తున్నట్లు పాన్ ఇండియా తరహాలో సినిమా చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

 

ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో కబీర్ సింగ్ గా తెరకెక్కించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకోవడంతో సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయడానికి చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు రెడీ అయిన క్రమంలో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు స్క్రిప్టు కూడా మొత్తం సిద్ధం చేసినట్లు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు చాలా గట్టిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి.

 

ముఖ్యంగా ఈ సినిమాని మొదట రణబీర్ కపూర్ తో తీయాలని ప్లాన్ చేసిన అంతా ఓకే అయిన తర్వాత ఒక్కసారిగా రణబీర్ కపూర్ సినిమా నుండి తప్పుకోవడంతో...అదే స్టోరీతో ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా  చేయటానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల వచ్చిన ఈ వార్తలు అన్నీ పుకార్లే అన్నట్లు అసలు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ ని కలవడం కూడా జరగలేదని ఇద్దరూ ఎవరికి వారు తమ తమ సినిమాల పనులలో బిజీగా ఉన్నారని వచ్చిన వార్తలు అన్నీ పుకార్లే అని కావాలని పుట్టించడం జరిగిందని ప్రభాస్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: