టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతి త్వరలో పింక్ అనే బాలీవుడ్ రీమేక్ గా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని, అలానే సినిమాలో కీలకమైన కోర్ట్ సెట్టింగ్ ని కూడా మొదలెట్టిందట సినిమా యూనిట్. ఇక దీని తరువాత పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ తో హృదయానికి హత్తుకునే సినిమాగా క్రిష్ దీనిని తెరకెక్కించనున్నారట. ఇకపోతే పవన్

 

ఈ రెండు సినిమాలతో పాటు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్టు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి పూరిని దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం చేసిన పవన్, తొలిసారిగా ఆయనతో కలిసి బద్రి అనే సూపర్ హిట్ మూవీలో నటించారు. తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమా మాత్రం ఘోరంగా దెబ్బతింది. ఇకపోతే ముచ్చటగా మూడవ సారి పవన్ తో జతకట్టనున్న పూరి, ఆయన కోసం ఒక మంచి మాస్, యాక్షన్ స్టోరీ ని సిద్ధం చేస్తున్నారని, ఇప్పటికే తాను ప్రకటించిన విజయ్ దేవరకొండ సినిమా

 

అలానే డబుల్ ఇస్మార్ట్ సినిమాల అనంతరం పవన్ సినిమాని మొదలెడతారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం తమ కాంబోలో సినిమా విషయమై పూరి, పవన్ ని కలిసారని, ప్రస్తుతానికి తాను ఒప్పుకున్న ప్రాజక్ట్స్ పూర్తి అవ్వగానే మీతో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చినట్లు సమాచారం. ఇక ఆ సినిమా కోసం అతి త్వరలో పూర్తి స్థాయిలో కథని డెవలప్ చేసే పనిలో ఉన్నారట పూరి. అన్నీ కలిసి వస్తే, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే పవన్, పూరి కాంబోలో ఒక మంచి సినిమా రూపొందడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: