ప్రస్తతం తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. తొలిసారిగా కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్, ఆ తరువాత సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ హిట్ తో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. అనంతరం గోపీచంద్ సరసన లౌక్యం, రామ్ తో కలిసి పండగ చేస్కో, ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో వంటి హిట్ సినిమాల్లో నటించిన రకుల్, ఆ తర్వాత నుండి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా బోల్తాకొడుతున్నాయి. 

 

ఇక మరోవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకున్న రకుల్ కు, అక్కడ కూడా మంచి హిట్ అయితే దక్కనే లేదు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం శంకర్, కమల్ హాసన్ ల కలయికలో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న రకుల్, రెండు టాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కించుకున్నట్లు సమాచారం. అయితే వాటి వివరాలు మాత్రం వెల్లడికావలసి ఉంది. కాగా నేడు ఒక ఫ్యాషన్ షో నిమిత్తం మరొక హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో కలిసి ముంబై చేరుకున్న రకుల్, తన హాట్ డ్రెస్ తో ఫ్యాన్స్ కి, ముఖ్యంగా యువకులకు నిద్ర లేకుండా చేసింది అనే చెప్పాలి. 

 

బ్లాక్ కలర్ ట్రెండీ స్టైల్ షార్ట్ డ్రెస్స్ లో దర్శనం ఇచ్చిన రకుల్, అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇక ఆ షోకు వెళ్తున్న ప్రగ్య, రకుల్ లను గమనించి ఫోటోలు క్లిక్ మనిపించారు మీడియా వారు, అయితే తన లేటెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ తో మీడియావారికి పలు ఫోజులిచ్చింది రకుల్. ఇక ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఆమె ఫోటోలపై వావ్ రకుల్ సూపర్ అంటూ పలువురు యువత తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: