పవర్ బ్యాంగ్, ఏ బ్యాకప్ లేకుండా ఫుల్ రీ చార్జ్ తో టాలీవుడ్ లో దూసుకొచ్చిన కుర్ర హీరో రాజ్ తరుణ్. మీడియం సినిమాలకు మాంచి హీరో అనిపించుకున్నాడు. కోటి రూపాయలు దాటిన రెమ్యూనిరేషన్ అందుకున్నాడు. కుమారి 21 ఎఫ్ లో హీరోయిన్ ఇదే నా ఫస్ట్ కిస్ అంటే అబ్బా అంటూ ఆవురావురంటు చూశాడు. మంచి హిట్ కొట్టాడు. అలాంటి హీరో తప్పుల్లో కాలేసాడు. సబ్జెక్ట్ లు తేడా కొట్టాయి. సినిమాలు ఫెయిలయ్యాయి. దాంతో కిందకు జారిపోయాడు. 

 

ఇలాంటి నేపథ్యంలో ఆగిపోయిన సినిమాను  మళ్లీ పట్టాలు ఎక్కించడానికి నిర్మాత దిల్ రాజు .. రాజ్ తరుణ్ కి మరో అవకాశం ఇచ్చాడు. అంతకు ముందు లవర్ అనే సినిమా చేసారు ఇద్దరూ కలిసి. కానీ సక్సెస్ కాలేదు. అలాగే కృష్ణారెడ్డి అనే డైరక్టర్ గల్లా అశోక్ హీరోగా సినిమా స్టార్ట్ చేసారు. అది ఆగిపోయింది. ఆ ఆగిపోయిన సినిమా, ఈ రాజ్ తరుణ్ తో తీయాలని ప్లాన్ చేసి, ఫినిష్ చేసారు. లవర్ సినిమా ఫ్లాప్ పావడం, రాజ్ తరుణ్ స్లంప్ లో వుండడం, ఆగిపోయిన సినిమాను మళ్లీ స్టార్ట్ చేయడంతో ఖర్చు కొంత వుండడం, ఇవన్నీ కలిసి హీరో రెమ్యూనిరేషన్ మీద ప్రభావం చూపించాయట.

 

ఈ సినిమాకు రాజ్ తరుణ్ కు సినిమా విడుదలకు ముందు జస్ట్ 10 లక్షలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అయి వుంటే మళ్లీ ఏమయినా ఇచ్చి వుండేవారేమో? కానీ ఇప్పుడు అలా జరగలేదు కాబట్టి, ఇక అదే రెమ్యూనిరేషన్ అనుకోవాలి. అయితే నిర్మాతగా దిల్ రాజు సేఫ్ గానే ఉన్నారట. ఎందుకంటే సినిమాను చాలా తక్కువ ఖర్చులో తీసారు. నాన్ థియేటర్ హక్కుల మీదే ఆ అమౌంట్ వెనక్కు రాబట్టేసుకున్నారు. ఓన్ రిలీజ్ కాబట్టి సమస్య లేదు. 

 

రాజ్ తరువాత తరువాత సినిమా కొండా విజయ్ కుమార్ తో నిర్మాత రాధామోహన్ నిర్మిస్తున్నారు. దానికి మాత్రం కాస్త రీజనబుల్ రెమ్యూనిరేషన్ నే ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాజ్ తరుణ్సినిమా మూద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. యూత్ ని బాగా అట్రాక్ట్ చేయాలని ముద్దులు మీద ముద్దులు పెట్టాడు. కాని ఏం లాభం సినిమా పోయింది. రాజ్ తరుణ్ అకౌంట్ లో ఓ ఫ్లాప్ పడింది. ఈ సినిమా ప్రభావం నెక్స్ట్ సినిమా మీద పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: