60 ఏళ్ల వయసుల్లోనే యంగ్ జనరేషన్‌కు పోటి ఇచ్చే స్థాయిలో గ్లామర్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్న సీనియర్‌ హీరో అక్కినేని నాగార్జున. ఇటీవల మన్మథుడుగా మరోసారి దర్శనమిచ్చిన నాగ్‌ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాడు. ఇప్పటికీ లుక్స్‌ విషయంలో మన్మథుడు అనిపించుకుంటున్న నాగ్‌ కథ విషయంలో మాత్రం తప్పు చేశాడు. ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన మన్మథుడు 2 బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడటమే కాదు నాగ్ ఇమేజ్‌ను కూడా భారీగా డ్యామేజ్‌ చేసింది. దీంతో దిద్దుబాటు చర్యల్లో పడ్డాడు ఈ సీనియర్‌ హీరో. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్‌గా బంగార్రాజు సినిమాను ప్రకటించినా దాన్ని ఇంకా పట్టాలెక్కించలేదు.

 


బిగ్‌బాస్ సీజన్ 3 కార్యక్రమానికి హోస్ట్‌గా చేసి అందరిని మెప్పించిన అక్కినేని నాగార్జున మళ్ళీ ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించనున్నాడు. మన్మధుడు2 సినిమా తరువాత బిగ్ బాస్ 3తో బిజీ అయిపోయిన నాగార్జున వైల్డ్‌ డాగ్‌ అనే సినిమాని చేయబోతున్నాడు.

 

అయితే మహర్షి, ఊపిరి చిత్రానికి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో నాగార్జున ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయ‌న ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాగార్జున నేడు విడుదల చేశారు.

 

ఇక ఇదిలా ఉంటే...నాగ్‌ బంగార్రాజు కన్నా ముందు ఓ రీమేక్‌ సినిమాలో నటించనున్నాడట. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట కింగ్‌. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్‌ సంస్థ అధినేత సునీల్ నారంగ్‌.. నాగ్ హీరోగా సినిమాను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. 1980ల కాలంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా రైడ్ సినిమాను తెరకెక్కించారు. పీరియాడిక్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్‌ దేవగన్ హీరోగా నటించాడు. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అజయ్‌ ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌) ఆఫీసర్‌గా నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: