బన్నీ త్రివిక్రమ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "అల వైకుంఠపురములో" ఈ చిత్రం మీద అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ టీజర్ లో మరింత స్టైల్ గా కనబడ్డాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులని అలరిస్తుందనే ధీమాతో ఉన్నారు.

 

సినిమా నుండి ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. మొదటి పాట సామజవరగమనా నుండి నాలుగో పాట బుట్టబొమ్మ వర్కి దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి. ఒక్కో పాట ఒక్కోలా చెవులకి ఇంపుగా చాలా అందంగా ఉంది. అయితే ఈ సినిమాలోని మొదటి రెండు పాటౌ యూట్యూబ్ లో రికార్డు సృష్టించాయి. సామజవరగమనా, రాములో రాములో పాటలకి విశేష స్పందన లభించింది. రెండు పాటలు యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి.

 

ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు సినిమాకి కూడా ఇలా జరగలేదు. ఒకే సినిమా నుండి రెండు పాటలు ఈ ఘనత సాధించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుండి ఐదవ పాట విడుదలకి సిద్ధమ్ అవుతోంది.కాకుళం యాసలో ఉండబోయే ఈ ఫోక్ సాంగ్ మిగిలిన అన్ని పాటలకంటే బాగుటుందని, అందుకే సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు దాన్ని విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

 

సామజవరగమన పాటతో ఆల్బమ్ కు ఎలాంటి గొప్ప స్టార్ట్ ఇచ్చారో ఈ ఫోక్ సాంగ్ తో అంతే గొప్ప ఎండింగ్ ఇవ్వాలనేది తమన్ అండ్ టీమ్ ఆలోచనట. మరి ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అయ్యి మ్యూజికల్ గా సినిమాగా ఎలాంటి పేరొస్తుందో చూడాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: