2019 సంవత్సరంలో టాలీవుడ్ లో వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోలైన కొందరి సినిమాలు ఒక్కటి కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు. ఈ హీరోల నుండి ఈ సంవత్సరం సినిమాలు రాకపోయినా 2020లో మాత్రం ఫ్యాన్ ను నిరాశ పరచమని ఈ హీరోలు చెబుతున్నారు. ఈ హీరోలలో ప్రథమంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. 
 
2018 సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ మరో సినిమాలో నటించలేదు. ఈ సంవత్సరం అంతా పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. పవన్ ఈ సంవత్సరం పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ పడినా పవన్ మరలా పింక్ సినిమా రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. పింక్ సినిమా తరువాత పవన్ మరిన్ని సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2018 మే నెలలో విడుదలైన నా పేరు సూర్య సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటించటానికి ఓకె చెప్పారు. 2020 సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత కెరీర్ లో గ్యాప్ రాకుండా సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించటానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 
 
మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీయార్ 2018లో వచ్చిన అరవింద సమేత తరువాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 2019 సంవత్సరంలో తారక్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.మరో స్టార్ హీరో రవితేజ నుండి కూడా ఈ సంవత్సరం ఏ సినిమా రిలీజ్ కాలేదు. అమర్ అక్బర్ ఆంటోనికి ముందే డిస్కోరాజా సినిమా ఓకె అయింది. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో 2020 జనవరిలో రిలీజ్ కాబోతుంది. మరో హీరో నితిన్ నుండి కూడా ఈ సంవత్సరం ఒక్క సినిమా రాలేదు. నితిన్ రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న భీష్మ సినిమా 2020లో విడుదల కాబోతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: