సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. ప్రేక్షకులకు కొత్త ధనాన్ని అందించడానికి దర్శక నిర్మాతలందరూ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకే తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. ఇక కొత్తగా వచ్చిన హీరోయిన్లు తమ సత్తా చాటుకుని కొంతమంది టాప్ హీరోయిన్లుగా కొనసాగుతుంటే ఇంకొంతమంది రెండు మూడు సినిమాలకే పరిమితమైన ఆ తర్వాత కనుమరుగైపోయారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్ లుగా  చాలామంది కొనసాగుతున్నప్పటికీ కొత్త హీరోయిన్లకు మాత్రం ఢోకా లేదని చెప్పాలి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఇలా అన్ని సినిమాలలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. 2019లో కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్లుగా చాలామంది కొత్తవారు వచ్చారు. ఇప్పుడు వారు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 

 శివాత్మిక : జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక. టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన శివాత్మిక దొరసాని సినిమాలో నటించింది. పరువు హత్యల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాత్మిక తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. మొదటి సినిమాతోనే నటిగా  ఎన్నో ప్రశంసలు అందుకుంది శివాత్మిక. కమర్షియల్ సినిమాల కోసం కాకుండా కథలో బలం ఉండే  వైవిధ్య ఆత్మకు సినిమాల కోసం ఎదురుచూస్తుంది ఈ కొత్త హీరోయిన్. 

 

 

 దివ్యాంశ కౌశిక్ : ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన నాగచైతన్య సమంత జోడిగా నటించిన మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. ఈ సినిమాలో నాగచైతన్య ప్రియురాలిగా నటించింది ఈ అమ్మడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చూడాలి మరి ఈ అమ్మడు రాబోయే సంవత్సరంలో ఎన్ని సినిమాలను చేజిక్కించుకుని తన హవా చూపిస్తుందో. 

 

 

 అనన్య : పెళ్లి చూపులు సినిమా తో మెప్పించి.. కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి హీరోగా వచ్చిన సినిమాలో అనన్య హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అందరినీ కట్టిపడేసింది అనన్య. ప్రియదర్శి అనన్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మల్లేశం. చేనేత కళాకారుడు మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి గా అనన్య తన నటనకు మంచి మార్కులు వేసుకుంది. మరి ఈ అమ్మడు మరిన్ని సినిమాలు అవకాశాలు చేజిక్కించుకుంటుందా  లేదా చూడాలి మరి. 

 

 

 వాని భోజన్ : తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్... ఆ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాణంలో మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో  దర్శకుడు హీరో తరుణ్ భాస్కర్ సరసన వాని  భోజన్  హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు మీకు మాత్రమే చెప్తా సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

 

 

 అనఘా : ఆర్ఎక్స్ 100 సినిమాలో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా  మారిన హీరో కార్తికేయ నటించిన 90 ఎమ్మెల్ సినిమాలో కార్తికేయ సరసన నటించింది హీరోయిన్ అనఘా . ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. కానీ తన మొదటి సినిమాతోనే అపజయాన్ని మూటగట్టుకుంది. మరి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఈ అమ్మడికి వస్తాయో చూడాలి మరి. 

 

 

 సలోని  మిశ్రా  : విశ్వక్సేన్ హీరోగా నటించిన ఫలక్నుమా దాస్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది సలోని మిశ్రా . ఈ సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంది ఈ అమ్మడు. మరి 2020 లో ఈ అమ్మడు దర్శక నిర్మాతలను ఎంతగా ఆకర్షించి అవకాశాలను దక్కించుకుంటుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: