టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ.  ఆయన తర్వాత స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే కళ్యాన్ రామ్ హీరోగా కొనసాగుతూనే సొంతగా ఓ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్నారు.  ఇప్పటికే టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది అగ్ర హీరోలకు వాళ్ల కంటూ ఓన్ బ్యానర్స్ ఉన్నాయి. అతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఇపుడిపుడే పైకి వస్తున్న అప్ కమింగ్ హీరోలు కూడా నిర్మాత అవతారం ఎత్తుతున్నారు.   మహేష్ బాబు, రామ్ చరణ్ లు ఇప్పటికే తమ సొంత బ్యానర్ లో సినిమాలు తీశారు. తొలిసారి ఇప్పుడు బయట హీరోతో కూడా సినిమా చేయబోతున్నాడు. అడివి శేష్ హీరోగా తెరకెక్కనున్న మేజర్ సినిమాను మహేష్ బాబే స్వయంగా నిర్మించనుండడం విశేషం. ఇక ప్రభాస్ సైతం తన ఫ్రెండ్ యూవి క్రియేషన్స్ లో షేర్ మెయింటేన్ చేస్తున్నట్లు సమాచారం.

 

త్వరలో అల్లు అర్జున్ సైతం ఓ సొంత ప్రొడక్షన్ పెట్టే యోచనలో ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.  మంచు ఫ్యామిలీలో ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క బ్యానర్ ఉంది. మోహన్ బాబు ఎప్పటినుండో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నాడు. మంచు విష్ణుకు 24 ఫ్రేమ్స్ అనే బ్యానర్ ఉంది. మంచు లక్ష్మికి లక్ష్మి టెలీఫిల్మ్స్ పేరిట సొంత బ్యానర్ ఉంది. ఇవి చాలవన్నట్లు మంచు మనోజ్, MM ఆర్ట్స్ పేరిట ఒక బ్యానర్ ను స్థాపించాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం సొంతగా ఓ బ్యానర్ పెట్టబోతున్నారని ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వచ్చాయి.  

 

అయితే ఆయన బ్యానర్ కి ఏం పేరు పెట్టబోతున్నారన్న విషయం పై మాత్రం సస్పన్స్ కొనసాగుతూ వస్తుంది.  తన తండ్రి .. తన తనయుడు పేర్లు కలిసి వచ్చేలా, 'భార్గవ్ హరి ప్రొడక్షన్స్' పేరుతో ఒక బ్యానర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ బ్యానర్ కు సంబంధించిన విశేషాలు తెలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్,  చరణ్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: