ప్రస్తుతం ఓటమెరుగని దర్శక ధీరుడు జక్కన్న ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే... బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి మాత్రమే కాదు రాజమౌళి కుటుంబం మొత్తం ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఎందుకంటే తమ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఒకే సినిమాలో అరంగేట్రం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ లో దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న తనయుడు శ్రీ సింహ హీరోగా పెద్ద కుమారుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం రొటీన్గా కాకుండా అన్ని  సినిమాలకంటే కాస్త భిన్నంగా ఉండడంతో ప్రేక్షకులను తెగ ఆకర్షించేస్తుంది. 

 


 విడుదలైన రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది ఈ చిత్రం. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. అయితే చిత్ర యూనిట్ తో పాటు రాజమౌళి కుటుంబం కూడా ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా జైసింహ సత్య అగస్త్య లను దర్శక ధీరుడు రాజమౌళి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. ఈ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో లో భాగంగా రాజమౌళి అడిగిన ప్రశ్నలకు.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు ఈ ముగ్గురు . 

 


 సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు... ఆ సమయంలో ఈ ముగ్గురు ఎదుర్కొన్న కష్టాలు గురుంచి  ఈ సక్సెస్ మీట్ వీడియో త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాకి రితేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్.. క్లాక్  ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇకపోతే ఈ ప్రోమోలో  భాగంగా రాజమౌళి ఈ సినిమాలో ఎవరిని ఒక్కటి పీకాలనీ అనిపించింది అంటూ రాజమౌళి ప్రశ్నించగా... ముగ్గురు కలిసి డైరెక్టర్ను అని చెప్పారు. దీంతో డైరెక్టర్ ని ఒక్కటి పీకలనిపించిందా   అంటూ రాజమౌళి నవ్వుకున్నారు. ఎందుకు పీకాలి అనిపించింది అని రాజమౌళి ప్రశ్నించగా... ప్రతి షాటీ  లో అభ్యంతరాలు చెప్పే వాడు అని ఈ ముగ్గురుచెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: