సెల‌బ్రెటీల్లో అప్పుడే కొత్త సంవ‌త్స‌ర వేడుక మొదల‌య్యాయి. ఎలా ఎంజాయ్ చేయాలా అని కొత్త కొత్త ప్లాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేయ‌డం మొద‌లు పెట్టారు అప్పుడే. తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రు కూతుర్లు... శివాని, `దొరసాని` ఫేమ్ శివాత్మిక ఇద్దరు కూడా సింగపూర్ వెళ్లారు. తన స్నేహితులతో కలిసి వీరంతా అక్కడ హైట్స్ లో స్విమ్ చేస్తూ నానా హంగామా చేసారు. ఇద్దరు భామలు బికినిలో తెగ రెచ్చిపోయార‌నే చెప్పాలి. ఇప్పుడు ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 

 


 ఇలాంటి సంస్కృతి బాలీవుడ్‌లో ఎక్క‌వ‌గా క‌నిపిస్తుంది. బికినీల్లాంటి బ‌ట్ట‌లు వేసుకుని బీచ్‌లో ర‌చ్చ చేస్తూ ఫొలోలు షేర్ చేయ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ భామ‌లు కూడా దాన్నే ఫాలొఅవుతున్నార‌నే చెప్పాలి.  తాజాగా రాజశేఖర్ కూతుళ్లిద్దరూ ఇలా బికినీతో కనువిందు చేయడం సంచలనం రేపింది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమాతో శివాని హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత మరో సినిమాకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 


ఇక రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మిక .. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి చేసిన దొరసాని సినిమాతో పరిచయం అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్న `రంగమార్తాండ` సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. మరాఠీలో సూపర్ హిట్టయిన ఓ సినిమాను రంగమార్తాండ గా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాడు కృష్ణవంశీ. ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి హిట్ అందుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

 

ఇప్పటికే ఈ సినిమా కోసం కీ రోల్స్ లో బ్రహ్మానందం , అనసూయలను ఎంపిక చేసాడు కృష్ణవంశీ. ఇందులో మరో కీ రోల్ కోసం ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికాను ఎంపిక చేసాడు. శివాత్మిక హీరోయిన్ గా దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో శివాత్మికకు అవకాశాలు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: