పవన్ సినిమాల్లోకి మళ్ళి రీ ఎంట్రీ మీద రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయం మీద అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. దిల్ రాజు నిర్మాణంలో పింక్ సినిమా మొదలయిందని వార్తలు వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ నుండి మాత్రం ఎలాంటి సమాచారమ్ లేదు. అసలు పవన్ కళ్యాన్ నిజంగా రీ ఎంట్రీ ఇస్తున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఒకవైపు పింక్ సినిమా స్క్రిప్టు పనులు చకచకా జరిగిపోతుంటే నిజమనే నమ్మాలి.

 

 

ఎందుకంటే ఈ సినిమాలో ఇప్పటికే ప్రధాన పాత్రలయినా ముగ్గురు హీరోయిన్లని ఆల్రెడీ తీసుకున్నారట. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎమ్ సీ ఏ సి చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడట.  అయితే ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరో చిత్రం గురించి అప్పుడే వార్తలు వస్తున్నాయి. పవన్ పూరి కాంబినేషన్ లో సినిమా గురించే ఈ వార్త సమాచారం.

 

పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ విజయంతో జోరు మీదున్నాడు. ఆ జోరు తోనే విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందట. అందుకు కావాల్సిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అటు ఫైటర్ సినిమా పనులు జరుగుతుండగానే ఈ వార్త రావడం ఆశ్చర్యకరమే.

 

పింక్ సినిమా రీమేక్ తర్వాత పవన్ పూరి దర్శకత్వంలో నటిస్తాడని అంటున్నారు.  ఇక ఆ సినిమా కోసం అతి త్వరలో పూర్తి స్థాయిలో కథని డెవలప్ చేసే పనిలో ఉన్నారట పూరి. అన్నీ కలిసి వస్తే, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. మరి ఈ సమాచారం ఎంత మేరకు నిజమో తెలియాలంటే పూరి, పవన్ లలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: