జెమినీ టీవీలో ప్రసారం అయిన ‘జోగి బ్రదర్స్’ కార్యక్రమంలో తనదైన శైలి యాసతో పాపులర్ అయిన జోగి నాయుడు జోగి బ్రదర్స్‌లో ఒకరు. ఈయన సుమారుగా 100 సినిమాలకు పైగా ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. 1998 లో జెమిని టీవీలో ప్రసారమైన జోగి బ్రదర్స్ అనే కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో మరో వ్యాఖ్యాత కృష్ణంరాజుతో కలిసి సినిమాల గురించి ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని చాలా అలరించారు.

 

 

ఇకపోతే మొదట్లో ప్రముఖ యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లాడాడు జోగి నాయుడు. జెమినీ టీవీలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో జోగినాయుడు, యాంకర్ ఝాన్సీల మధ్య పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. ఇద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది. అయితే వివాహం అనంతరం ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. కాగా ఝాన్సీ యాంకరింగ్‌తో పాటు సినిమాలతో బిజీగా ఉండగా.. జోగి నాయుడు అప్పుడప్పుడూ వెండి తెరపై కనిపించేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘మా ఆవిడ మీద ఒట్టు.. మీ ఆవిడ చాలా మంచిది’ అనే చిత్రంతో బుల్లి తెర నుండి వెండి తెరకు పరిచయం అయ్యారు జోగి నాయుడు.

 

 

ఆ తరువాత అమ్మ నాన్నతమిళ అమ్మాయి, ఠాగూర్, వాసు, స్వామిరారా, కార్తికేయ చిత్రాల్లో కనిపించారు. యాంకర్ ఝన్సీతో విడిపోయిన 4 సంవత్సరాల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఇక దర్శకుడు అవుదామని హైదరాబాదుకు వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో ప్రవేశించాడు. కొద్ది రోజులు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఒక రికార్డింగు స్టూడియో కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ స్టూడియో లేదు. ఇకపోతే చాలా కాలం తర్వాత జోగి బ్రదర్స్ మళ్లి బుల్లితెరపై కనిపిస్తున్నారు. సాక్షి టీవిలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ కొత్త పోగ్రాం వస్తుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: