బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకి ఒకరి దగ్గర నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చింది. అంతేకాదు మాటన వినకపోతే నోటీసులు కూడా పంపుతానంటు బెదిరించారట. అయితే ఇది ఎందుకో తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. సాధారణంగా ఇలాంటి సంఘటనలు స్టార్స్ కి ఎదురవుతాయని ఏ ఒక్కరు ఊహించరు. కానీ ఈ వార్నింగ్ మాత్రం ప్రియాంకా పరువు తీసేసింది. వివాదాస్పద భారతీయ గురూజీ ఓషో శిష్యురాలు 'మా ఆనంద్ షీలా' జీవితకథతో ఓ సినిమాని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నానని అమెరికా కోడలు ప్రియాంక చోప్రా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ది ఎలెన్ షో లైవ్ లో ఈ విషయాన్ని ప్రకటించడం సంచలనమైంది. ఏకంగా ప్రియాంకా బెదిరిపోయో రేంజ్ లో వార్నింగ్స్ వచ్చాయి.

 

టైటిల్ పాత్ర లో తాను నటించడమే గాక నిర్మాత గానూ పెట్టుబడులు పెడుతున్నానని ప్రియాంక తెలిపింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'రెయిన్ మేన్' ఫేం బ్యారీ లెవిన్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా మొదలవకముందే ఈ బయోపిక్ తెరకెక్కించేందుకు వీల్లేదంటూ మా ఆనంద్ షీలా ప్రియాంక కి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఈ బయోపిక్ చేయాలనుకుంటే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటించాలి కానీ ప్రియాంక నటించేందుకు వీల్లేదు అంటూ హెచ్చరించారు. అయితే సీరియస్ గా అలా హెచ్చరించడానికి ఓ ఆసక్తికర కారణం ఉందట. 69 ఏళ్ల షీలా యుక్త వయసులో అచ్చం ఆలియాభట్ లా ఉండేదట. అందువల్ల తన పాత్రలో ఆలియా మాత్రమే నటించాలని పట్టు బడుతోంది. అయితే ఇందులో నటించేందుకు పీసీ ఆసక్తి ని కనబరుస్తుండడంతో షీలా లీగల్ నోటీసులు పంపించారట.

 

మొత్తానికి వివాదాలతో చెలరేగే పని పెట్టుకుంది ప్రియాంక. ఇప్పటికే షీలా జీవితకథతో నెట్ ఫ్లిక్స్ లో ఓ సిరీస్ సంచలనం సృష్టించంది. వైల్డ్ వైల్డ్ కంట్రీ.. అనేది టైటిల్ తో రూపొంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 69 ఏళ్ల షీలా జీవితంపై బయోపిక్ లు తీసేందుకు చాలా మంది ఆసక్తి చూపించినా ఎందుకో మరి పెద్ద తెర పై ఆ ప్రయత్నం కుదరలేదు. కానీ ఇప్పుడు ప్రియాంక సాహసం చేస్తుంటేనేమో అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి ఆలియాని ఈ సినిమా కోసం ఒప్పిస్తుందా? లేదా షీలా డిమాండ్ ని లైట్ తీస్కుని తానే నటిస్తోందా..! అన్నది త్వరలోనే క్లారిటి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: