కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని. పెళ్లి కి ముందు గ్లామరస్ అండ్ రొమాంటిక్ పాత్రలు చేసిన సమంత పెళ్ళి తరువాత ఎక్కువగా నటనకు ప్రాధానయ్మ్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది. అందుకనే మజిలీ, ఓ బేబి వంటి సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాయి. ఇక ఈ ఆక్కినెని కోడలు ప్రస్తుతం 96 రీమేక్లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత సమంత చేయబోయే సినిమా ఇంకా కన్ఫార్మ్ కాలేదు. అయితే సామ్ కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కానీ తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. 96 రీమేక్ తరువాత మరోసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్ జానర్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. నయనతార ప్రధాన పాత్రలో 'మాయ', తాప్సీ లీడ్ రోల్లో 'గేమ్ ఓవర్' సినిమాలను తెరకెక్కించిన అశ్విన్.. సమంత తోనూ అదే జానర్లో ఓ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడని కోలీవుడ్ మీడియా లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే సమంతకు కథకూడా వినిపించినట్టుగా తాజాగా తెలిసిన వార్త. అశ్విన్ చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా ఓకె చెప్పేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే 96 రీమేక్ షూటింగ్ పూర్తయ్యింది. తమిళ్లో త్రిష నటించిన జాను పాత్రను తెలుగులో సమంత పోషిస్తోంది. తమిళ వర్షన్కు దర్శకత్వం వహించిన ప్రేమ్కుమార్ తెలుగు వర్షన్ను కూడా తెరకెక్కించాడు. ఈ సినిమాలో సమంతకు జోడిగా శర్వానంద్ నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్కు రెడీ అవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల బాగా లేటయింది. అయినా పక్కా హిట్ కొట్టే దిశగా టీం ప్రయత్నిస్తున్నారట. ఇక సమంత ఒక వెబ్ సిరీస్ లోను నటిస్తోంది. అయితే గతంలో నయనతార, తాప్సితో సినిమాలు తీసిన అశ్విన్ ఈ సారి ఆఇద్దరిని వద్దనుకొని సమంత ను సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.