జై లవ కుశ ఫేమ్ బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకీ సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించగా నాగ చైతన్య కు జోడిగా రాశీ ఖన్నానటించింది. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం
అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఏడాది
ఫిబ్రవరి 2 న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తో
వెంకీ , చైతన్య ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టారు. ఈసినిమా
కన్నా ముందు వెంకటేశ్ ఈసంక్రాంతికి ఎఫ్ 2 తో ప్రేక్షకులముందుకు రాగ ఆ చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా రికార్డు సృష్టించింది. అలాగే వెంకి మామ
కన్నా ముందు ఈ ఏడాది సమ్మర్ లో
మజిలీ తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు
నాగ చైతన్య.