ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా చక్రం తిప్పిన దర్శకుడు శ్రీను వైట్ల. ఇందులో అబద్దం ఏమీ లేదు. తెలుగులో దాదానె అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన శ్రీను ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు. దశ తిరిగినంత కాలం వరుస హిట్లిచ్చిన శ్రీను వైట్ల తర్వాత వరుస ఫ్లాపులిచ్చి ఇండస్ట్రీలో ప్రస్తుతం కనుమరుగైపోయాడు. ఆయనతో సినిమా అంటేనే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ ఆలోచించే పరిస్థితి వచ్చేసింది.

 

 

దీనిపై శ్రీను మాట్లాడుతూ.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో నేను ఎలాంటి సినిమాలు తీస్తున్నానో అర్ధమైంది. ఒకేరకమైన జోనర్ లో నేను తీస్తున్న సినిమాలతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. నేను మారాల్సిన టైమ్ వచ్చిందని అర్ధమైంది. ఇప్పుడో కథ రాసుకుంటున్నాను. వచ్చే ఏడాది ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమాతో నన్ను ఫ్రెష్ గా ప్రెజంట్ చేసుకుని ప్రేక్షకుల్ని మెప్పిస్తాను’ అన్నాడు. కధ, హీరో గురించి చెప్పలేదు కానీ.. తనేం చేయాలో మాత్రం స్పష్టతతో ఉన్నట్టు చెప్పాడు. పోకిరి తర్వాత మహేశ్ కు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాంటి శ్రీను వైట్ల అదే మహేశ్ తో తీసిన ఆగడు సినిమాతో దారుణమైన ఫ్లాప్ ను ఇచ్చాడు. అప్పటి నుంచి మొదలైన శ్రీను బ్యాడ్ టైమ్ ఇంకా నడుస్తోంది.

 

 

బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. వంటి డిజాస్టర్లతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఒకే రకమైన కామెడీతో వెళ్లడం తన కెరీర్ కు మైనస్ అయింది. ప్రస్తుతం తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. హీరోగా పలువురు పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాతో అయినా శ్రీను వైట్ల బౌన్స్ బ్యాక్ అయితే ఆయన నుంచి మళ్లీ మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: