అల్లు అరవింద్ ఆయన భార్య నిర్మలకు వివాహం జరిగి 45 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేరిద్దరూ కలిసి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వ్యక్తిగాత జీవితాన్ని గురించి అనేక మందికి తెలియని విషయాలను షేర్ చేసాడు. ఈ సందర్భంలో అరవింద్ అల్లు శిరీష్ పుట్టడం వెనుక ఉన్న బర్త్ సీక్రెట్ ను బయటపెట్టాడు. 

వాస్తవానికి అల్లు శిరీష్ పుట్టక ముందు అరవింద్ నిర్మల దంపతులకు ముగ్గురు మగపిల్లలు అట. తమకు ముగ్గురు పిల్లలు పుట్టడంతో నిర్మల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించు కుందట. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు వల్ల తమకు పుట్టిన మూడవ అబ్బాయి చనిపోవడంతో తిరిగి తనకు చనిపోయిన ఆ మూడవ అబ్బాయి కొడుకుగా పుట్టాలి అంటు అరవింద్ భార్య నిర్మల రీకేనలైజేషన్ ఆపరేషన్ చేయించుకుందట.

అప్పట్లో వైద్య శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందకపోవడంతో ఆ ఆపరేషన్ గా మారి మూడు గంటలు జరిగిన తరువాత వైద్యులు అరవింద్ భార్యను పరీక్షించి ఆపరేషన్ ఫెయిల్ అయింది అంటూ ఇక నిర్మలకు పిల్లలు పుట్టడం కష్టం అని స్పష్టంగా చెప్పెసారట. అయితే వైద్య శాస్త్రానికి భిన్నంగా ఆ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలలకు నిర్మల కన్సీవ్ అవ్వడంతో పాటు ఆమె కోరుకున్నట్లుగానే మగబిడ్డ పుట్టడంతో చనిపోయిన ఆబాబు మళ్ళీ పుట్టాడు అని అరవింద్ నిర్మల దంపతుల నమ్మకం ఆ పుట్టిన బాబే అల్లు శిరీష్.

దీనితో తామిద్దరం చాల గారాబంగా పెంచామని అతడు ఏమి అడిగితే అది చేసామని అంతేకాదు ఇప్పటికీ శిరీష్ ఏమి అడిగినా తాము చేస్తూనే ఉంటాము అంటూ నిర్మల తన చిన్న కొడుకు శిరీష్ పై ఉన్న ప్రేమను బయటపెట్టింది. అంతేకాదు తన కొడుకులు ముగ్గురులో ఇప్పటికీ శిరీష్ తనతో చాల సన్నిహితంగా ఉంటూ అమ్మచాటు బిడ్డలాగే ఉంటాడు అంటూ తామిద్దరం 45 సంవత్సరాల నుంచి భార్యభర్తలు గా అన్యోన్యంగా ఉండడానికి గల కారణం ఒకరి పై ఒకరికి ఉన్న విపరీతమైన నమ్మకం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: