స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అవగా సినిమా మీద మరింత అంచనాలు పెంచాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురములో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న ఫిక్స్ చేశారు.

 

హైదరాబాద్ లో జరుగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తాడని వార్తలు వచ్చాయి. అయితే తారక్ఈవెంట్ కు రావట్లేదని లేటెస్ట్ టాక్. ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి సరిలేరు నీకెవ్వరు సినిమా ఈవెంట్ కు వెళ్తున్నాడు. అందుకే రాం చరణ్ అయినా అల వైకుంఠపురములో సినిమా ఈవెంట్ కు వస్తాడని అనుకుంటే అతను కూడా రావడం కష్టమని అంటున్నారు.

 

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ ఎవరు రావట్లేదని లేటెస్ట్ న్యూస్. కేవలం చిత్రయూనిట్ సమక్షంలోనే ఈ ఈవెంట్ జరుగుతుందట. టాలీవుడ్ లో అంతమంది హీరోలుండగా బన్ని కోసం ఒక్కరు కూడా రావట్లేదని తెలుస్తుంది. అయితే సోలోగా సినిమాను ప్రమోట్ చేసుకుని సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.

 

సినిమా సాంగ్స్ ఇప్పటికే ఆడియెస్ కు బాగా ఎక్కేశాయి. సాంగ్స్ వల్ల సినిమా సగం హిట్ అయినట్టే.. ఇక త్రివిక్రం పెన్ పవర్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రం హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీ తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు. సంక్రాంతికి వచ్చే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు సరైన పోటీ ఇచ్చే సినిమాగా అల వైకుంఠపురములో వస్తుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: