మరొక రెండు రోజుల్లో ఈ ఏడాది పూర్తి అయి 2020 సంవత్సరం ప్రవేశించబోతోంది. ఇక ఈ ఏడాదికి వీడ్కోలు పలికి సరికొత్త యేడాదిని ఆహ్వానించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అందరూ సన్నద్ధం అవుతున్నారు. ఇక సినిమా తారలు కూడా ఈ న్యూ ఇయర్ ని ఎంతో వేడుకగా జరుపుకోవాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటులు సైతం ప్రత్యేకంగా ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారు తమ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ పార్టీని మంచి జోష్ తో చేసుకోబోతుంటే, 

 

పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్య లెజెనోవాతో కలిసి ఆమె దేశానికి పయనం అయ్యారు. అయన న్యూ ఇయర్ వేడుకను అక్కడే సెలెబ్రేట్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ న్యూ ఇయర్ వేడుకల కోసం పలువురు బాలీవుడ్ తారలు కూడా బాగానే ప్లాన్స్ చేస్తున్నారు. యువ హీరో వరుణ్ ధావన్ అయితే, ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని స్విట్జర్లాండ్ లోని గడ్డకట్టించే ఒక చలి ప్రాంతంలో గల రిసార్ట్ లో చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సేనియర్ నటి కరిష్మా కపూర్, తన సోదరి కరీనా, వరుణ్ లతో దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. 

 

ఆ ఫొటోలో వారు ముగ్గురు కలిసి స్విట్జర్లాండ్ లోని చలి ప్రదేశంలో భారీ చలి దుస్తులు వేసుకోవడం గమనించవచ్చు. ప్రతి ఏడాది కూడా ఎంతో వినూత్నంగా న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకునే వరుణ్, ఈ ఏడాది స్విట్జర్లాండ్ లో తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీ కోసం దిగిన ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసారు. ఇక ప్రస్తుతం కరీనా, కరిష్మాలతో కలిసి వరుణ్ దిగిన ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: