‘నాపేరు సూర్య…’ వంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వం లో ‘అలా వైకుంఠపురం లో’ సినిమా స్టార్ట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘నా పేరు సూర్య..’ సినిమా రిజల్ట్ దారుణంగా ఉండటంతో అప్పటివరకు మంచి సక్సెస్ లో నడిచిన బన్నీ కెరియర్ పూర్తిగా డౌన్ఫాల్ రావడంతో మరొక సినిమా చేయడానికి తీసుకున్న సమయంలో చాలా కథలు విన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసి...వెంటవెంటనే మరొక సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ‘అల వైకుంఠపురంబులో’ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన కెరీర్ లో రెండు అద్భుతమైన విజయాలు అందించిన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మాస్ మసాలా సినిమా స్టార్ట్ చేసాడు అల్లు అర్జున్. 

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఆరు రోజుల షూటింగ్ కేరళలో జరిగింది. అయితే రెగ్యులర్ షూటింగ్ లో జనవరి 17 తారీకు నుండి అల్లు అర్జున్ జాయిన్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ అంతా త్రివిక్రమ్ సినిమా పైన పెట్టి ప్రమోషన్ కార్యక్రమాలు అదరగొట్టే రీతిలో చేసి 'అలా వైకుంఠపురం లో' సినిమా రిలీజ్ అయ్యాక సుకుమార్ సినిమా పై దృష్టి పెట్టే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. అంతేకాకుండా సినిమాని ఏకకాలంలో కంప్లీట్ చేసి సమ్మర్ కల్లా విడుదల చేయాలనే ప్లాన్ లో అల్లు అర్జున్ ఉన్నట్టు సమాచారం.

 

అదేవిధంగా జనవరిలోనే సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతానికి వినికిడిలో డైరెక్టర్ సుకుమార్ ద‌గ్గ‌ర మూడు నాలుగు టైటిళ్లు రెడీగా ఉన్నాయి. వాటిలో ఒక‌టి ఎంచుకుని, ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. సో జనవరిలోనే సినిమాకి సంబంధించిన టైటిల్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్లో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: