శ్రీను వైట్ల లైఫ్ ను తీసుకుంటే ఆగడు సినిమాకు ముందు ఆగడు తరువాత అని తీసుకోవాలి. ఆగడు సినిమాకు ముందు శ్రీను వైట్ల సినిమాలు వరసగా హిట్ అవుతూ వచ్చాయి. 1999 లో వచ్చిన నీకోసం సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ దర్శకుడు, తరువాత ఆనందం, వెంకీ, అందరివాడు, సొంతం, డీ, దుబాయ్ శ్రీను, కింగ్,రెడీ, నమో వెంకటేశ, దూకుడు, బాద్షా ఇలా అన్ని మంచి సినిమాలే.
ఈ సినిమాలన్నీ కూడా తెరపై మంచి విజయాలు సాధించాయి. ఆ తరువాత ఆగడు సినిమా తీశాడు. అక్కడి నుంచి శ్రీను వైట్ల పతనం మొదలైంది. ఆ సినిమా ఆగకుండా పోవడంతో మహేష్ బాబు కొంత ఇబ్బంది పడ్డాడు. శ్రీనువైట్లతో మళ్ళా సినిమా చేయకూడదు అనుకున్నాడు. మరీ ఇంతదారుణమా అని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. దూకుడు లాంటి సినిమా ఇస్తాడు అనుకుంటే ... ఆగడు ఇచ్చి మహేష్ ను ఇబ్బంది పెట్టాడు.
ఆగడు తరువాత శ్రీను వైట్ల కొంత గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ తో బ్రూస్ లీ తీశాడు. అదికూడా అట్టర్ ప్లాప్. ఆ తరువాత వరుణ్ తేజ్ తో మిస్టర్ అన్నాడు. అదీ అడ్రస్ లేకుండా పోయింది. తనకు బాగా కలిసి వచ్చిన మాస్ మహారాజ రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేశాడు. అసలే హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్న రవితేజకు భారీ ప్లాప్ ఇచ్చి ఇండస్ట్రీలో మరో ప్లాప్ అందుకున్నాడు. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు వరసగా ప్లాప్ కావడంతో వైట్ల పని అయిపోయిందని అనుకున్నారు.
అమర్ అక్బర్ ఆంటోని తరువాత శ్రీను వైట్ల మరో సినిమా చేయలేదు. అయితే, ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో మంచు విష్ణుకు డీ వంటి మంచి హిట్ సినిమా ఇచ్చాడు. దీంతో ఇపుడు ఈ దర్శకుడు మరలా విష్ణునే నమ్ముకున్నాడు. విష్ణుకు ఇటీవలే ఓ కథ చెప్పాడట. కథ నచ్చడంతో విష్ణు ఒకే చేశారని, త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.