నితిన్ నటించిన లై  చిత్రం తో  తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చింది  చెన్నై  బ్యూటీ మేఘా ఆకాష్. 2017లో విడుదలైన  ఈచిత్రం  నిరాశపరిచింది. అయితే  ఈ చిత్రం తరువాత   ఈహీరోయిన్ మరో సారి నితిన్ తో జోడి కట్టింది. వీరిద్దరి  కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో చిత్రం  చల్ మోహన్ రంగ కూడా  లై ఫలితాన్ని పునరావృతం చేయడం తో మేఘా  ఆకాష్ కు  అవకాశాలు కరువైయ్యాయి. దాంతో ఆమె కోలీవుడ్ కు వెళ్ళి  అక్కడ  బిజీ అయ్యింది.  తమిళం లో  శింబు సరసన అత్తారింటికి దారేది రీమేక్ లో హీరోయిన్ గా నటించగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట లో కూడా ఓ కీలక పాత్రలో నటించింది.
 
ఇవి  కాకుండా మేఘా  ఆకాష్, ధనుష్  కు జోడిగా  ఎన్నై నొక్కి  పాయుమ్ తూటా అలాగే  యువ హీరో  అధర్వ మురళి తో బూమరాంగ్ అనే చిత్రాల్లో నటించింది.  ఇటీవల విడుదలైన ఈ రెండు చిత్రాలు పరాజయం చెందాయి. అయితే ఇప్పుడు ఈ రెండు  సినిమాలను తెలుగులోకి డబ్ చేసి విడుదలచేస్తున్నారు.  అందులో  భాగంగా  జనవరి 1న  ఎన్నై నొక్కి పాయుమ్ తూటా తెలుగు వెర్షన్  తూటా పేరుతో విడుదలకానుంది.  గౌతమ్ మీనన్  డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శశి కుమార్  కీలక పాత్రలో నటించాడు. 
 
ఇక  భూమరాంగ్ కూడా అదే టైటిల్ తో జనవరి 3న విడుదలకానుంది. కణ్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సతీష్ కుమార్  తెలుగు లో విడుదల చేస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకుంటారో చూడాలి.  ఇక తెలుగు ,తమిళం లోనే కాకుండా ఇటీవల శాటిలైట్ శంకర్  తో  హిందీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. సూరజ్ పంచోలి హీరోగా నటించిన  ఈ చిత్రం ఇటీవల విడుదలై  పర్వాలేదనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: