2019 చివరికొచ్చేసాం. అందుకే ఒక సారి ఈ సంవత్సరం టాలీవుడ్‌ కు మిగిల్చిన అనుభవాలను తరచి చూసుకుంటే ఎన్ని హిట్ సినిమాలు వచ్చాయో, ఓవర్సీస్‌లో మన తెలుగు సినిమాలు ఏ రేంజ్‌లో సత్తా చాటాయో.. ఇండస్ట్రీలో 2019 ఎంతమందికి కలిసొచ్చిందో.. ఎంత మందికి బెడిసికొట్టిందో తెలుసుకుంటే చాల చిత్రమని పిస్తుంది..

 

 

ఇక తెలుగు సినిమాలకి గత ఏడాది వరకూ ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉండేది. అక్కడ అత్యధిక కలెక్షన్లు డాలర్ల రూపంలో వచ్చేవి. ఒకగానొక సందర్భంలో 1 మిలియన్ అనేది మన స్టార్ హీరోలకి కేక్ వాక్ అయిపొయింది. కానీ ఈ ఏడాది పరిస్థితి మొత్తం మారిపోయ. పెద్ద దెబ్బే పడింది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమా కూడా అక్కడ వసూళ్ళు రాబట్టలేకపోయింది అంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నాని, విజయ్ దేవరకొండ.. వంటి హీరోలకు కూడా ఈ ఏడాది ఓవర్సీస్ మార్కెట్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.

 

 

బహుశా అమెజాన్, నెట్ ఫిక్స్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ వల్ల దెబ్బతిందా అనే డౌట్ కూడా కొందరిలో మొదలైంది. ఇదంతా పక్కన పెడితే 2019 ఓవర్సీస్ లో మన సినిమాల పెర్ఫార్మన్స్ రిపోర్ట్ ను ఒకసారి గమనిస్తే..  మెగాస్టార్ 151 వ చిత్రంగా  తెరకెక్కిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం ఈ ఏడాది ఓవర్సీస్ టాప్ గ్రాసర్ అనే చెప్పాలి. ఈ చిత్రం $ 2470 K (2.4 మిలియన్) డాలర్లను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని అక్కడ భారీ రేట్లకు విక్రయించడంతో బ్రేక్ ఈవెన్ కాలేక పోయింది...

 

 

అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఈ చిత్రం ఓవర్సీస్ లో $2135 K (2.1 మిలియన్) డాలర్లను రాబట్టి.. బయ్యర్స్ అందరికీ లాభాలని అందించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండీ బాహుబలి 2’  తరువాత  వచ్చిన చిత్రం ‘సాహో’..  ఈ  చిత్రం ఓవర్సీస్ లో ఒక్క తెలుగు వెర్షన్ కే $2.110 K (2.1 మిలియన్ డాలర్లను) వసూల్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని కూడా భారీ రేట్లకు విక్రయించడంతో అక్కడ ప్లాప్ అనే చెప్పాలి... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘ఓవర్సీస్ కింగ్’ అనే పేరుంది. కానీ ఈఏడాది వచ్చిన ‘మహర్షి’ చిత్రం ఆ పేరుని నిలబెట్టలేక పోయిందనే చెప్పాలి. ఈ చిత్రం అక్కడ $1891 K (1.8 మిలియన్) డాలర్లను మాత్రమే వసూల్ చేసి యావేరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది..

 

 

నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘జెర్సీ’.. కేవలం $1.324 K (1.3 మిలియన్) డాలర్లతో అబౌవ్ యావేరేజ్ గా నిలిచింది.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం ఓవర్సీస్ లో ఫైనల్ గా అక్కడ $1.021 ఖ్ (1 మిలియన్) డాలర్లను వసూల్ చేసింది...  నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’ ఓవర్సీస్ లో $773 K (0.7 మిలియన్) డాలర్లను వసూల్ చేసి అక్కడి బయ్యర్స్ కు లాభాలు అందించింది.  

 

 

వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీమామ’ చిత్రం కూడా ఇప్పటి వరకూ $600ఖ్ (0.6 మిలియన్) డాలర్లను రాబట్టి బయ్యర్స్ ను సేఫ్ జోన్ లోకి నెట్టింది. .. అలాగే నానిన్ గ్యాంగ్ లీడర్, ఎన్టీఆర్ కథానాయకుడు & ఎన్టీఆర్ మహా నాయకుడు యావరేజ్‌గా నిలవగా, సాయి తేజ్ కెరీర్ లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘ప్రతీరోజూ పండగే’ ఈ చిత్రం ఇప్పటి వరకూ $433 K (0.4 మిలియన్) డాలర్లను వసూల్ చేసి.. బయ్యర్స్ అందరికీ లాభాలు అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: