అనుష్క ప్రభాస్ ల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేకసార్లు గాసిప్పులు వచ్చాయి. ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ప్రభాస్ అనుష్కలు ఖండిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసం తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కోసం చూస్తున్నామని వచ్చే ఏడాది జూన్ తరువాత ప్రభాస్ పెళ్ళి ఉండవచ్చు అంటూ లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ విషయం జరిగి కొద్దిరోజులు కూడ అవ్వకుండానే ఇప్పుడు ప్రభాస్ అనుష్కలు మళ్ళీ ఒక వేదిక పై కనిపించి సందడి చేయడానికి రంగం సిద్ధం అయింది. అనుష్క లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ అతిధిగా రావడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

జనవరి 31న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంక్రాంతి పండుగ హడావిడి అయిపోయిన తరువాత జనవరి 20వ తారీఖు ప్రాంతంలో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.  కోన వెంకట్ పీపుల్ మీడియా సంస్థ అధినేత విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఈ మూవీలో మూగ పాత్రలో నటిస్తున్న అనుష్క చుట్టూ తిరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పటికే ఈ మూవీలో అనుష్కతో కలిసి నటిస్తున్న మాధవన్ ల జంటకు సంబంధించిన ఫోటోలు చూసిన వారు వీరిద్దరి కాంబినేషన్ బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంజలి అమెరికాలోని పోలీసు ఆఫీసర్ గా నటిస్తుంటే షాలినీ పాండే అవసరాల శ్రీనివాసులు ఈ మూవీలో మరో రెండు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతి సినిమాల హడావిడి అయిపోయిన తరువాత ‘నిశ్శబ్దం’ గా సూపర్ హిట్ కొట్టాలని అనుష్క చేస్తున్న ప్రయత్నాలకు ప్రభాస్ ప్రమోషన్ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: