టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు పై ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడయ్యాయని, వాటిని దక్కించుకున్న గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు ఈ సినిమాని అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ఓవర్సీస్ లో బాగా కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన మహర్షి మాత్రం అక్కడ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ ని సాధించలేదు. నిజానికి ఓవర్సీస్ మార్కెట్ ని మొదట భారీ స్థాయిలో అందుకుంది, అలానే ఆ విధంగా పలు సినిమాలతో ఓవర్సీస్ లో రికార్డు కలెక్షన్ కొల్లగొట్టింది కూడా మహేష్ బాబు అనే చెప్పాలి. 

 

అటువంటి మహేష్ కు మహర్షి ద్వారా అక్కడ ఒకింత ఇబ్బంది ఎదురవడంతో, ఈసారి సరిలేరుతో ఎలాగైనా అద్భుతంగా కలెక్షన్ రాబట్టేలా ఇప్పటినుండి ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయనున్నారు సినిమా యూనిట్ వారు. ఇక మహేష్ బాబు ఓవర్సీస్ లో తన కలెక్షన్స్ స్టామినాని చూపించాల్సిన టైం ఇదేనని, అలానే తప్పకుండా తమ సినిమా మంచి హిట్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్ రాబడుతుందని సరిలేరు యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: