దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. బాహుబలి లాంటి  సినిమా తీసిన రాజమౌళి చేతిలో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మీదే దేశ‌మంతా దృష్టిసారించారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కు జోడిగా ఐర్లాండ్ కు చెందిన ఒలీవియా మోరిస్ నటిస్తోంది.  ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ 70శాతం షూటింగ్ పూర్తి చేశామని యూనిట్ ప్రకటించన విష‌యం తెలిసిందే.

 

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. అయితే రాజమౌళి తన చిత్రం యొక్క ప్లాట్ లైన్ ఇది అని ముందే చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఈ చిత్రానికి కూడా చెప్పారు. అయితే మెయిన్ స్టోరీ ఏమిటా అన్నది కాస్త సస్పెన్స్ గానే ఉంచారు కానీ ఇప్పుడు ఓ కీలక వ్యక్తి చెప్పిన మాటలు విని తార‌క్ అభిమానుల‌తో పాటు దేశ‌మంత‌టా భారీ అంచ‌నాలు పెరిగాయి. ఇటీవ‌ల కీరవాణి గారి తనయుడు సింహా కోడూరి ప్రధాన పాత్రలో నటించిన `మత్తు వదలరా` చిత్రం ప్ర‌క్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగంతి తెలిసిందే.

 

అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కీర‌వాణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తీసిన చిత్రాల్లో ఏది మీకు బాగా ఇష్టం అని అడగ్గా ఇప్పుడు నటిస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా స్టోరీ నాకు తెలుసు కాబట్టి ఈ చిత్రమే అని అన్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ మాత్రం కాన్ఫిడెన్స్ తమకు చాలని సోష‌ల్ మీడియా వేదిక‌గా సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అని ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. కాగా,  ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 30,2020లో విడుదల చేయనున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: