తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో సినిమా అంటే చాలామంది తమిళ సినిమా రంగంలో ఉన్న టాప్ హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తరు. ప్రస్తుతం మురగదాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'దర్బార్' అనే సినిమా చేయడం జరిగింది. సినిమాలో రజినీకాంత్ ని పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో చూపించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 'దర్బార్' సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న డైరెక్టర్ మురుగదాస్ తెలుగు సినిమా ప్రేక్షకులు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేటర్ ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' అనే సినిమా చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన 'స్పైడర్' సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

 

అయితే స్క్రిప్టు విషయంలో మరియు అదే విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని...కొన్ని విషయాల్లో ఎక్కువగా మహేష్ ఎంట్రీపై నే సినిమాలో ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేసా. బహుశా తెలుగు ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయానేమో! అందువల్లే స్పైడర్ కు న్యాయం చేయలేకపోయానని అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు ఎటువంటి కథలు ఇష్టపడతారో స్టడీ చేసి రాబోయే రోజుల్లో తెలుసుకొని..కచ్చితంగా ఓ మంచి సినిమా త్వరలో చేయబోతున్నట్లు డైరెక్టర్ మురుగదాస్ క్లారిటీ ఇచ్చారు.

 

గతంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లకముందు 'స్టాలిన్' అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ కావడంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచులను డైరెక్టర్ మురుగదాస్ కనిపెట్టలేక పోతున్నారని ఖచ్చితంగా మురుగదాస్ మాత్రం భవిష్యత్తులో తెలుగులో కూడా ఓ భారీ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా రజినీకాంత్ నటించిన 'ధర్భర్' సినిమా పైనే ఉన్నట్లు ఈ ప్రమోషన్ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా 'స్పైడర్' సినిమా లో జరిగిన తప్పులు నెక్స్ట్ తీయబోయే సినిమాలో ఉండవని ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: