దివంగత అతిలోక సుందరి, దిగ్గజ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఇటీవల ధఢక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ చీర రంగ ప్రవేశం చేసింది. తనను మంచి నటిగా వెండితెరపై చూడాలని అమ్మ ఎప్పుడూ కోరుకునేదని, అయితే తన తొలి చిత్రం ధఢక్ షూటింగ్ మధ్యలో ఉండగానే అమ్మ మరణించడం తనను ఎంతగానో కలిచివేసిందని ఇటీవల జాన్వీ పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేసిన జాన్వీ , ప్రస్తుతం నటిస్తున్న తదుపరి సినిమా గుంజన్ సక్సేనా. 

 

కార్గిల్ యుద్ధ సమయంలో తన ధైర్య సాహసాలతో ఎందరో గాయాలపాలైన సైనికులను రక్షించి విమానంలో వారిని వైద్య శిబిరాలకు చేర్చిన గుంజన్ ని ఎప్పటికీ మన దేశ ప్రజలు మరిచిపోలేరు. అప్పట్లో మన ప్రభుత్వం ఆమె చేసిన ఆ గొప్ప పనికి ఘనంగా సత్కరించడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం జాన్వీ ఈ సినిమాలో ఆమె పాత్రలోనే నటిస్తోంది. ఇక ఆ పాత్ర కోసం ఛాపర్ నడపడం, అలానే పలు యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న జాన్వీ, ఈ సినిమా పయనంలో భాగంగా తనకు ఎన్నో విషయాల్లో నిజాయితీగా, స్వచ్చతతో సహకరించిన దర్శకుడు శరణ్ శర్మను ఎప్పటికీ మరిచిపోలేనని, ఇటువంటి గొప్ప సినిమా దొరకడం తన అదృష్టం అని, 

 

అలానే ఈ సినిమా షూటింగ్ సమయంలో గడిపిన రోజులు తనకు ఎంతో అనుభూతిని మిగిల్చాయని, వాటిని ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది. ఇక శరణ్ తో కలిసి దిగిన ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన జాన్వీ, దీనికి మీరే ఒక క్యాప్షన్ ని పెట్టండి అంటూ తన ఫ్యాన్స్ ని కోరింది. పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 మార్చి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: