తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9కి ఎంతో మంచి పేరున్న న్యూస్ ఛానల్. ఇప్పుడు ఈ ఛానల్ ఓ అద్భుతమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ప్రజల కష్టాలను తెలుసుకుని.. సమస్యలను తీర్చేందుకు అహరహమూ శ్రమించిన టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్.. ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేనేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. వివిధ రాష్ట్రాల్లో విస్తరించింది. టీవీ9 వేసే ప్రతి అడుగు ప్రజలు చూపిందే. ప్రజల కష్టాన్ని తీర్చడం బాధ్యతగా భావించి.. క్షణక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తోంది టీవీ9.
ఈ బృహత్తర కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా.. లోక్సత్త పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ. రామలింగేశ్వర రావు వ్యవహరించారు. వీరితో పాటుగా యాంటి చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్, పద్మశ్రీ శాంతా సిన్హా.. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేసన్ అండ్ జర్నలిజం ప్రోఫెసర్ కే. నాగేశ్వర్, ఐపీఎస్ ఆఫీసర్ ఏం.వీ. కృష్ణారావు కూడా జ్యూరీ మెంబర్స్గా ఉన్నారు. టీవీ9 కోర్ కమిటీ నిర్ణయించిన అన్ సర్గ్ హీరోస్ లిస్ట్తో ఏకీభవిస్తూ.. విభాగానికి ఒక విజేతను ప్రకటించారు జ్యూరీ మెంబర్స్.
ఈ ప్రోగ్రాం ఎంతో ఇన్స్పిరేషన్గా ఉందని అన్నారు చిరంజీవి. ఎన్నో షోకి వెళతాం కాని ఈ ఫంక్షన్కి మాత్రం ఎంతో ఇష్టగా వస్తామని ఆయన పేర్కొన్నారు. టీవీ9 చేస్తోన్న ఈ కార్యక్రమంలో ఎంతో హృద్యంగా, ఇన్స్పిరేషన్గా ఉందన్నారు. వివిధ కేటగిరీల్లో ఎంతో పేరు సంపాదించినవాళ్లకు టీవీ9 ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది గతాల గురించి తెలియజేసేందుకు ముందుకొచ్చిన టీవీ9 యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. కేవలం న్యూస్ ఛానెల్గానే కాకుండానే ఇలాంటి కార్యక్రమాలతో టీవీ9 ముందుకు రావడం.. ఆ టీవీ ఛానెళ్ల మీద గౌరవం పెరుగుతుందన్నారు.