‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక కేవలం ఒక వారం రోజుల గ్యాప్ లో జరగబోతున్న నేపధ్యంలో ఈ మూవీ ఫంక్షన్ ఏర్పాట్లు అత్యంత భారీగా జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో జరగబోతున్న నేపధ్యంలో వీలైనంత ఎక్కువ స్థాయిలో మహేష్ అభిమానులు ఈ ఫంక్షన్ కు వచ్చేలా కొన్ని వేల సంఖ్యలో పాసులు ప్రింట్ చేసి ఈరోజు నుంచి మహేష్ అభిమాన సంఘాలకు పంపిణి చేయబోతున్నట్లు సమాచారం. 

ఈవెంట్ జరిగే ప్రాంగణం చాలపెద్దది కాబట్టి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ పరంగా కూడ చాలగట్టి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 13 సంవత్సరాలు తరువాత విజయశాంతి రీ ఎంట్రీ ఈమూవీ ద్వారా జరుగుతున్న నేపధ్యంలో ఆమె కూడ ఈమూవీ నిర్మాతలను వేల సంఖ్యలో పాస్ లు అడగడమే కాకుండా గతంలో తనతో ‘తల్లి తెలంగాణ’ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు ఆ పాస్ లు పంపి వారందరూ ఆ ఫంక్షన్ కు వచ్చేలా ప్లాన్ చేస్తూ తాను ఇంకా రాజకీయాలలో కోన సాగుతున్నాను అన్న సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్.

వాస్తవానికి గతంలో విజయశాంతి చిరంజీవిల కాంబినేషన్ చాల హిట్ పెయిర్. ఆతరువాత వారి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో వీరిద్దరు కలిసి నటించడం మానివేశారు. అయితే వీరిద్దరూ ఎప్పుడు ప్రత్యక్షంగా ఒకరి పై ఒకరు విమర్శలు సెటైర్లు వేసుకోలేదు. 

ఇలాంటి పరిస్థితులలో తిరిగి వీరిద్దరూ ఒకే వేధిక పైకి రావడంతో వీరిద్దరూ పాత విషయాలను మరిచిపోయి మళ్ళీ ఎలా స్నేహ పూర్వకంగా కనిపిస్తారు అన్న విషయమై ఆసక్తి పెరుగుతోంది. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న మూవీలో తనకు ఒక పాత్రను క్రియేట్ చేయమని విజయశాంతి దర్శకుడు అనీల్ రావిపూడి ద్వారా కొరటాల కు పంపిన లీకుల విషయాలు తెలుసుకుని చిరంజీవి కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: