సినిమాలు రాజకీయాలు మాత్రమే కాదు ప్రస్తుతం మనిషి జీవితం సెంటిమెంట్ చుట్టూ తిరుగుతోంది. ఈ సెంటిమెంట్స్ ప్రభావం వలనే అంతరిక్ష శాస్త్ర వేత్తల దగ్గర నుండి సామాన్యుల వరకు తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం పై నమ్మకం లేక కనిపించని దైవశక్తి ఆశీర్వాదం కోసం దేవాలయాల చుట్టూ తిరగడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. 

‘సరిలేరు నీకెవ్వరు’ విజయం మహేష్ కెరియర్ గ్రాఫ్ మరింత పెంచడానికి చాల అవసరమైన పరిస్థితులలో మహేష్ తనకు లభించిన ఏమార్గాన్ని వదులుకోవడం లేదు. ఈ ప్రయత్నాలలో భాగంగా మహేష్ నిన్న షిరిడీ వెళ్ళి సాయి బాబాను దర్శించు కోవడమే కాకుండా సాయినాధుడు కొలువై ఉండే ద్వారకామాయి ప్రాంతంలో కొద్ది సేపు ప్రశాంతంగా ధ్యానించు కోవడం మీడియా వర్గాలకు హాట్ న్యూస్ గా మారింది.

మహేష్ షిరిడి పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడు అన్నీ ప్రముఖ ఛానల్స్ నుండి పత్రికల వరకు ప్రచురిస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ బాబా సహాయం కోరాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. గతంలో అఖిల్ మొట్టమొదటి సినిమా ‘అఖిల్’ ఘనవిజయం సాధించాలని నాగార్జున అమలా నాగచైతన్య అఖిల్ లు కలిసి షిరిడి వెళ్ళడమే కాకుండా అక్కడ జరిగే హారతుల కార్యక్రమంలో కూడ పాల్గొన్నారు. 

అయితే మొదటి సినిమా మాత్రమే కాదు ఇప్పటి వరకు నటించిన ఏ సినిమా హిట్ కాలేదు. గతంలో మహేష్ కూడ తన ‘ఆగడు’ సినిమా ఘన విజయం సాధించాలని కడప దర్గా కు వెళ్ళి అక్కడ ఆ దర్గాలో ప్రార్ధనలు చేసాడు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ ప్రత్యేకంగా షిరిడీ వెళ్ళి సాయి బాబాను ప్రార్ధించడంతో బాబా ఆశీర్వాదంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసి బన్నీ మూవీని తట్టుకుని సంక్రాంతి రేస్ లో విజయాన్ని సాధించడానికి బాబా ఎంతవరకు మహేష్ కు సహకరించి ఆశీర్వాదం ఇస్తారో చూడాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: