ఒక‌ప్పుడు తెలుగు హీరోయిన్స్ గతంలో కాస్త సెక్సీగా చూపటానికి ఆలోచించేవారు. అయితే మారిన కాలంతో బాలీవుడ్ హీరోయిన్స్ తో సమానంగా ఇక్కడా పోటీ పడటం మొదలెట్టారు. వెండితెరను వేడిక్కించటం కామన్ అయ్యిపోయింది. వెండితెరపై 'బికినీలు' ధరించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టటం మన హీరోయిన్స్ ఆనవయాతీగా మారింది. బికినీతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు పెరిగిపోతున్నారు. హోమ్లీ హీరోయిన్స్ సైతం బికినీ వేసి కుర్రకారుని రెచ్చగొడుతున్నారు. ఏ తెలుగు హీరోయిన్ కూడా బికినీ లేదా స్విమ్ సూట్ కి వెనకడుగు వేయటం లేదు.

 


ఇక ఇదిలా ఉంటే... బికినీ.. టూపీస్ ట్రీట్ అంటే ఎప్పటిలానే బాలీవుడ్ నంబర్ వన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ కథానాయికలదే బికినీ ట్రీట్ లో ది బెస్ట్ పొజిషన్ అని చెప్పాలి. బాలీవుడ్ లో మలైకా- దిశా పటానీ- ఊర్వశి రౌతేలా- నోరా ఫతేహి- కత్రిన- నేహా శర్మ- కృతి సనన్- లారా దత్తా లాంటి భామల పేర్లు ఓ రేంజులో పాపులరయ్యాయి.

 

ఇక టాలీవుడ్ వరకూ వస్తే.. ప్రగ్య జైశ్వాల్- కాజల్ అగర్వాల్- రాయ్ లక్ష్మీ- పూజా హెగ్డే ఇలా కొందరి పేర్లు ప్రముఖంగా హైలైట్ అయ్యాయి. దిశా పటానీ స్ఫూర్తితో కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే ట్రీటిచ్చింది. నిరంతరం జిమ్ ఫిట్ డ్రెస్సులతో పాటు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఇక ఎవ్వర్ లేటెస్టుగా అందాల చందమామ కాజల్ మాల్దీవుల విహారంతో వేడెక్కించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి లైవ్ గా బికినీ ఫోటోని ఫ్యాన్స్ కి సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసింది. పట్టీలతో డిజైనర్ బికినీ వేడెక్కించింది. అలాగే రాయ్ లక్ష్మీ సైతం రకరకాల సందర్భాల్లో బికినీ ట్రీట్ తో హీటెక్కించింది. బికినీ ట్రీట్ ని ఒక సిరీస్ లా మెయింటెయిన్ చేసింది రాయ్ లక్ష్మీ. అలాగే ఈ ఏడాది పూజా హెగ్డే బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 లాంటి భారీ చిత్రంలో నటించింది. ఈ అమ్మడి బికినీ ట్రీట్ కి కొదవేమీ లేదు. ఇలా 2019లో కుర్రాళ్ళ‌కు వీళ్ళ వేడి వేడి అందాలు బికినీల్లో చూపించి  మ‌త్తెక్కించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: