తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాలను  శరవేగంగా  జరుపుకుంటున్న ఈ చిత్రం  వచ్చే  ఏడాది సంక్రాంతి   కానుకగా జనవరి 9న తమిళం తోపాటు తెలుగులోనూ  విడుదలకానుంది. ప్రమోషన్ లో భాగంగా జనవరి 3న హైదరాబాద్ లోని  శిల్ప కళా వేదికలో  ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపనున్నారు. ఈ ఈవెంట్ కు రజినీ హాజరుకానున్నాడు.  ఈ చిత్రంలో  రజినీ, ఆదిత్య అరుణాచలం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా  ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది.  నయన్ ఈ చిత్రంలో రజినీ వైఫ్ గా ఆర్కిటెక్ట్ పాత్రలో  కనిపించనుందని సమాచారం. 
 
ఇటీవల  విడుదలైన   ఈచిత్రం యొక్క  ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకోవడం తో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  యంగ్ హీరోయిన్  నివేత థామస్ రజినీకి కూతరుగా నటించగా  బాలీవుడ్  ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా ఏఆర్ రెహమాన్  సంగీతం అందిస్తున్నాడు. ఇక  ఈ చిత్రానికి  తెలుగులో  గట్టి పోటీ ఎదురుకానుంది. సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ  రెండు బడా సినిమాలు  సరిలేరు నీకెవ్వరు , అల..  వైకుంఠపురములో బరిలో వున్నాయి. మరి ఈ చిత్రాల నుండి పోటీ తట్టుకోవాలంటే  దర్బార్ కు బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సిందే.  ఇక ప్రస్తుతం రజినీకాంత్,మాస్ డైరెక్టర్   శివ డైరెక్షన్ లో  తన 168 వ చిత్రంలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: