మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే.  డ్యాన్స్, ఫైట్స్, తనదైన మ్యానరీజంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాడు బన్నీ.  నివాస్ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ మూవీలో నటించారు.  దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ గా నటించారు.  లుకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపించాడు. కాకపోతే ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. దాంతో నిరాశలో ఉన్న బన్నీ దాదాపు రెండేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.  సరైన కథ కోసం ఎదురు చూస్తున్న బన్నీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ వినిపించడం.. బన్నీ ఓకే చెప్పడం జరిగిపోయింది.  వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీస్ తో మంచి విజయాలు అందుకున్నారు.  తాజాగా ‘అలా వైకుంఠపురములో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  

 

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లిరిక్స్, టీజర్ కి మంచి ఆదరణ వచ్చింది.  సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.  ఇక అల్లు అర్జున్‌ 20వ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఆర్య 2 తర్వాత ఎప్పటి నుంచో బన్నీకి కథలు వినిపిస్తున్న సుకుమార్ అతన్ని మెప్పించలేక పోయారు.  మొత్తానికి ఒక కథ ఓకే కావడం.. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ  సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయ్యిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జనవరి 17 తారీకు నుండి ప్రారంభించటానికి రంగం సిద్దం చేసారు. ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా పూర్తి మాస్ లుక్ లోకనిపించబోతున్నారట.  

 

ఆ రోజు నుంచే అల్లు అర్జున్ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.  కానీ ఇప్పడు ఈ మూవీ షూటింగ్ కి కొత్త చిక్కులొచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం శేషాచలం ఫారెస్ట్ లో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే అటవి శాఖ వారు నుంచి ఫర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పినట్లు టాలీవుడ్ టాక్.   కొన్ని భద్రతల దృష్ట్యా ఈ పరిమిషన్ ఇవ్వలేని అంటున్నారు. సుకుమార్..వెంటనే యాక్షన్ ప్లాన్ మార్చి ఈ సినిమాని బ్యాంకాక్ అడవుల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం.  మరి ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: