సినీ ప్రముఖులు సెలెబ్రిటీలు వెకేషన్ మూడ్ లోకి వెళ్లడం సర్వసాధారణం. తమ పనుల ఒత్తిడితోనో, బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత విశ్రాంతి తీసుకోవడం కోసమో వెకేషన్ కి వెళ్తూంటారు.  ప్రముఖ సినీ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఇదే పని చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను ఆమె దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో జరుపుకోబోతున్నారని తెలుస్తోంది.


ఈ సందర్భంగా రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే గోవా చేరుకున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను ఆమె ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి. భర్త, పిల్లలే కాకుండా.. మిగిలిన కుటుంబసభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. న్యూ ఇయర్ కు ఆమె అక్కడే ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇటువంటి సందర్భాలకు ఇలా వెకేషన్స్ కి వెళ్లడం సెలబ్రిటీలకు అలవాటే. విదేశాలకు కూడా ఇలా ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేస్తూంటారు సెలబ్రిటీలు.. సినిమా వాళ్ళు. ఇందుకు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, విహారయాత్రా ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు. గతంలో కూడా రోజా తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ కు వెళ్ళింది. అప్పట్లో ఆ ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

 


ఇటువంటి సెలబ్రేషన్స్ సెలెబ్రిటీలకు కొత్తేమీ కాదు. సినిమా సెలబ్రిటీస్ వెకేషన్ కు వెళ్లడంలో తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. వీలు చిక్కినప్పుడు.. తన సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన ఫ్యామిలీతో వెళ్తూంటారు. ఇంకా.. చిరంజీవి, నాగార్జున, నాగ చైతన్య - సమంత.. ఇలా తమ ఫ్యామిలీతో వెకేషన్ వెళ్తూంటారు. అది ఇండియాలోని ప్రముఖ ప్రదేశాలు కావొచ్చు.. విదేశాలు కావొచ్చు.. కుటుంబసమేతంగా వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటూంటారు. ఈసారి కూడా పలువురు సెలబ్రిటీలు ఇలానే సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: