ఈరోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు మారుతి. ఆ తర్వాత బస్ స్టాప్ చిత్రంతో  ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మెగా మేనల్లుడు సాయి తేజ్ తో ప్రతి రోజూ పండగే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నీ అందుకుంది. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది.

 


ప్ర‌తీ రోజూ పండ‌గే మంచి హిట్ కావ‌డంతో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు బ‌ద్ద‌లు కొడుతుంది. యావ‌రేజ్ టాక్‌తో మొద‌లైనా, ఈ సినిమా ఇప్పుడు లాభాల బాట ప‌ట్టింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాల్ని తీర్చిదిద్ద‌డంలో మారుతి ఒక ముద్రేమిట‌న్న‌ది మ‌రోసారి తెలిసొచ్చింది. డివివి దాన‌య్యకు మారుతిసినిమా చేయాలి. ఇది వ‌ర‌కే ఒప్పందాలు జ‌రిగిపోయాయి.  కానీ ఎందుకో మారుతి ఆలోచ‌న‌లు మారుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థ‌లు ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాయి. మారుతి మ‌రో ఆప్ష‌న్ వెదుక్కుంటాడేమో అని దాన‌య్య భావించాడో ఏమో.. ఏకంగా రూ.6 కోట్ల పారితోషికాన్ని ఆఫ‌ర్ చేశాడని తెలుస్తోంది. అంతేకాదు.. మిగిలిన కాస్ట్ అండ్ క్రూ విష‌యంలో మారుతికే స‌ర్వాధికారాల్ని అప్ప‌గించార‌ట‌.

 

 ఇది మారుతి కాద‌న‌లేని పారితోషికం. త‌న‌దైన మార్క్ కామెడీ, ఫ్యామిలీ డ్రామాల‌తో క‌థ‌ని న‌డిపిస్తే.. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా స‌రిపోతుంది. మ‌రోవైపు దిల్‌రాజు కూడా మారుతితో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాక‌పోతే హీరోలే ఇప్పుడు ఖాళీగా లేరు. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శ‌ర్వానంద్… మారుతి శైలికి స‌రిగ్గా స‌రిపోతారు. వాళ్లేమో ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈలోగా దాయ‌న్య వారుసుడితో సినిమా తీసేస్తే… అప్ప‌టికి హీరోలెవ‌రైనా ఖాళీ అవుతారేమో చూద్దామ‌న్న‌ది మారుతి ప్లాన్‌. ప్ర‌స్తుతం మారుతి ఇస్మార్ట్ హీరో రామ్ కూడా ఒక సినిమా చేసే ప్లాన్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి చివ‌రికి మారుతి నెక్స్ట్‌ట్ ప్రాజెక్ట్ ఎవ‌రితో మొద‌లుపెడ‌తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: