దీప్తి సునైన ఈ పేరంటే ఒక్కపుడు తెలియదేమో కానీ ఇప్పుడు ఆ పేరు తెలియని యువతి యువకులు లేరు. ఎందుకంటె చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో తన కెరియర్ స్టార్ట్ చేసిన దీప్తి సునైన షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ వీడియోస్ తో అందరిని అలరించింది. తరువాత బిగ్ బాస్ ప్రోగ్రం లో అలరించిన ఈ చిన్నది తనకంటూ ఓ పేరును కనపరుచుకుంది. ఇక కొత్తగా మరో సెలబ్రేషన్ చేసుకుంది. దీప్తి సునైన ఎవరు చేరని విధంగా ఇంస్టాగ్రామ్ లో తన సత్తా చాటింది ఈ చిన్నది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ‘1 మిలియన్’ ఫాలోవార్స్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన ఇంటిలో సెలబ్రేషన్ ను జరుపుకుంటూ అందరికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమె పెళ్ళి పై హాట్ టాపిక్ నడుస్తుంది. కోలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన నటి సునైనా. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తరువాత వరుసగా మాసిలామణి, యాదుమాగి, నీర్పార్వై, వంశం చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ధనుష్ హీరోగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రంలో కూడా ముఖ్య పాత్రలో నటించింది.
కాగా తాజాగా నటించిన సిల్లుక్కరుపట్టి చిత్రంలో సునైనా నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా, ఇటీవల ఒక యువకుడితో ఉన్న ఫొటోను నటి సునైనా తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అంతే అప్పటి నుంచి సునైనాకు పెళ్లైపోయ్యిందని, తన రహస్యంగా వివాహం చేసుకుందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సురైనాకు తలనొప్పిగా మారి ఆమెకు రక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంకొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. దీంతో ఈ అమ్మడికి నోరు విప్పక తప్పలేదు. ఈ వ్యవహారంపై నటి సునైనా స్పందిస్తూ తనకు పెళ్లైపోయిందన్న ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా వదంతి అని చెప్పింది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని తన వివాహాన్ని రహస్యంగా జరుపుకోవలసిన అవసరం లేదని. వరుడు ఎవరన్నది తెలియగానే తాను స్వయంగా బహిరంగంగా వెల్లడిస్తానని... వివాహాన్ని కూడా అందరి సమక్షంలో చూసుకుంటానని చెప్పింది. తొలుత హీరోయిన్గా పరిచయమైన ఈ భామ దశాబ్దన్నర పూర్తి చేసుకుంది.