ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ఈ చిత్రం 2020లో విడుదల కానుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2007 లో వచ్చిన సినిమా యమదొంగ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
అయితే ఈ సినిమాని తమిళ్ లో విజయన్ పేరుతో అనువాదం చేస్తున్నారు. దీనికి అనువాద రచయితగా ఏఆర్కే.రాజా పనిచేశారు. ఈ సినిమా కూడా 2020 జనవరి 3న తెరపైకి తీసుకరావడానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే మరోవైపు ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా సమయంలో త్రివిక్రమ్ టేకింగ్కు ఫిదా అయిన ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఉబలాటపడతున్నట్టు తెలుస్తోంది. దీంతో 2020లోనే వీరిద్దరి కాంబిలో కూడా ఓ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే.. స్టార్ డైరెక్టర్ హోదాను సంపాదించుకున్న అట్లీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ కూడా అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కూడా 2020లోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. ఏదేమైనా 2020లో మాత్రం అభిమానులకు ఎన్టీఆర్ వరుస సినిమాలతో సర్ ప్రైజ్ల మీద సర్ ప్రైజ్లు ఇవ్వనున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. 2020లో విడుదల కానున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో ఒకటైన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయాలనే కసితో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు జక్కన్న.