తెలుగులో వస్తున్న కామెడీ షో జబర్దస్త్ కి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్ధస్త్ తెలుగులో అత్యంత ప్రేక్షకాదరణ పొంది కావాల్సినంత ఆనందాన్ని అందిస్తున్న ఈ షో ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.  జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మీలు వెండితెరపై కూడా తమ జోరు కొనసాగిస్తున్నారు.  ఇక ఇందులో తమదైన స్కిట్స్ తో అలరించిన కొంత మంది నటులు ఇప్పటికే తెలుగు మూవీస్ లో మంచి కమెడియన్లుగా రాణిస్తున్నారు.  ఈ మద్య శకలక శంకర్, సుడిగాలి సుధీర్ లు హీరోలుగా మారారు.  

 

అయితే ఈ షోకు జడ్జిలుగా మెగా బ్రదర్ నాగబాబు, రోజా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, నాగబాబు వేరే షోకు వెళ్లిపోవడంతో రోజా ఒక్కరిపైనే భారం పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది.  ఎందుకంటే ప్రతివారం ఈ షోకి ఎవరో ఒకరు ప్రత్యేక గెస్ట్ వస్తున్నారు.  రెండు వారాలుగా సీనియర్ కమెడియన్ పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు. ఇక  జబర్దస్త్ కు వెన్నుముకగా నిలిచినా నాగబాబు వెళ్లిన ఆయన లేని లోటు కనిపించకుండా షో నిర్వాహుకులు చాలానే చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే.. నాగబాబు తో పాటు కొంత మంది ముఖ్యమైన టీం లీడర్లు కూడా వెళ్లిపోవటటంతో ఎప్పటినుంచో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కంటెస్టెంట్లు టీం లీడర్లు గా అవతారం ఎత్తుతున్నారు.  అప్పట్లో నాగబాబు ఉన్న సమయంలో ఒక టీం కు 10 పాయింట్ లు ఇచ్చేవారు. మిగిలిన టీంకు 9 పాయింట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పడు రోజా మాత్రం అందరికి 10 కి 10 పాయింట్స్ వేసేస్తున్నారు. దాంతో టీమ్ లీడర్లు, పార్టిసిపెంట్లూ అందరూ తెగ సంతోసంతో మరింత ఉత్సాహంతో కామెడీ పండిస్తున్నారు.

 

అయితే పాటూ సీనియర్ టీమ్ లీడర్లు కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కొత్త నీరు పారుతోంది.  గత కొంత కాలంగా ఎన్నో స్కిట్ చేసిన వారు ఇప్పుడు సొంతంగా టీమ్ లీడర్ గా ఎదగడంతో కొత్త పుంతలు తొక్కతుంది. అంతే కాదు జబర్ధస్త్ లో ఎప్పటి నుంచీ టీమ్ లీడర్లు అయ్యే అవకాశం దక్కక ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: