నాని హీరోగా వచ్చిన తెలుగు సినిమా “మజ్ను” తో వెండి తెరకు పరిచయం అయిన, అను ఇమ్మానుయేల్ వరసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసి.. గ్లామర్ తో  అలరించినా అనుకున్నంత క్రేజ్ సంపాదించలేక కనుమరుగైన పోయింది. ఈ మధ్యకాలంలో ఇమ్మాన్యువల్ కి అస్సలు ఆఫర్స్ లేవు. నాని, రాజ్ తరుణ్ లాంటి యూత్ హీరోలతో నటించినా అనుకి అస్సలు క్రేజ్ సంపాదించ లేకపోయింది.  

 

 

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించినా అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. గ్లామర్ షో చేసినా అమ్మడుకి అవకాశాలు కరువయ్యాయి. ఇకపోతే మళ్ళీ ఇన్నాళ్ళకి వార్తల్లోకి వచ్చిన అను ఇమ్మాన్యువల్ గ్లామర్ షో చేసి దెబ్బతిన్నా అంటుంది. కథల విషయంలో చేసిన పొరబాటు వలన తన కెరీర్ దెబ్బతిందని వాపోతుంది. అందమున్నా.. గ్లామర్ షో చేసినా… లక్ లేకపోవడం అను ని దెబ్బకొట్టింది.

 

 

అయితే కేవలం కథల విషయంలో ద్దృష్టి పెట్టనందుకే తనకు ఈ గతి పట్టిందని సన్నిహితులకు చెప్పి తెగ ఫీల్ అవుతుందట. అయితే ప్రస్తుతం అవకాశాలు లేని ఆమెకి ఏదో ఒకటి తగిలి మళ్ళీ ఫామ్ లోకి రాకపోతానా అని నమ్మకంతో టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా టాక్. అందుకే సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని హాటెస్ట్, గ్లామర్ ఫోటో షూట్స్ కి తెర లేపింది అను ఇమ్మానుయేల్.. అందుకు అనుగుణంగా తన స్టనింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ..కుర్రకారు మతులు పోగోట్టేస్తోంది ఈ భామా..

 

 

ఇకపోతే అను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాల‌న్‌” తెలుగులో “డిటెక్టివ్ ” గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది. అయితే వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇకపోతే 2020 వ సంవత్సరం అయినా అను ఇమ్మానుయేల్ ఫాం లోకి వస్తుందో వేచి చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: