రకుల్ ప్రీత్ సింగ్ .. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో రాకెట్ లా దూసుకొచ్చి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ తర్వాత వరుసగా వకాశాలు దక్కించుకొని కెరీర్ పరంగా యమా బిజీ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు-మెగా పవర్ స్టార్ రాం చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సహా టాప్ హీరోలందరి సరసన నటించేసింది. చెప్పాలంటే రెండేళ్ళ పాటు టాలీవుడ్ లో రకుల్ దే హవా అన్నట్టు సాగింది. ఏ సినిమాలో చూసినా రకుల్ కనిపించేది. దాంతో అందరు రకుల్ ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. ఇప్పట్లో రకుల్ కి తిరుగే లేదనుకున్నారు. మిగతా హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఆ రెండేళ్ళలో రకుల్ అందుకున్న రెమ్యూనరేషనే ఎక్కువ అని చెప్పాలి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా రకుల్ చేతిలో అవకాశాలు లేక డౌన్ అయింది. 

 

దాంతో కోలీవుడ్ బాలీవుడ్ అంటు గంతులేసింది. ఎక్కడా నిలకడగా ఉండలేకపోయింది. కిందా మీదా పడి హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. మర్జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. టాలీవుడ్ లో మాదిరిగా బాలీవుడ్ లో కూడా కెరీర్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకెళుతుందనుకుంటే హిందీ పరిశ్రమలో ఆశించినట్టుగా సక్సస్ లు దక్కలేదు. 
ఇక ఇటీవల 'దే దే ప్యార్ దే' లాంటి అడల్ట్ కంటెంట్ సినిమాతో ఒక మోస్తారు సక్సస్ ని అందుకుంది. అయితే 2019 రకుల్ కి సౌత్ లో అస్సలు కలిసి రాలేదు. ఈ బక్క పలచని బ్యూటీ తెలుగులో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించిన 'మన్మధుడు-2' ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో రకుల్ కి ఉన్న కొద్దిపాటి ఆశలు కూడా చల్లారిపోయాయి. తెలుగులో రకుల్ కెరీర్ ప్రస్తుతం ఖాళీ. అటు తమిళంలోనూ ఆశించిన అవకాశాలేవీ లేవు.

 

ఆ క్రమంలోనే హిందీ పరిశ్రమలో అయినా అవకాశాలు దక్కనున్నాయా? అంటే ఈ అమ్మడికి కొత్తగా ప్రాజెక్టులేవీ కన్‌ఫర్మ్ కాలేదు. అయితే చాలాకాలంగా పెండింగులో ఉన్న 'సిమ్లా మిర్చి' సినిమా ఇప్పటికి రిలీజవుతోంది. మొత్తానికి ఆర్థిక సంబంధమైన వివాదాల్ని పరిష్కరించుకుని రిలీజ్ కొస్తోంది. కనీసం ఈ సినిమా అయినా తనకు బ్రేకిస్తుందా.. ఆశించిన కెరీర్ బాలీవుడ్ లో మొదలవుతుందా అన్నది ఈ సినిమా రిలీజైతే గాని తెలీదు. ఏది ఏమైనా రకుల్ కి ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో అనూహ్యంగా మెగా ఫ్యామిలీ నుండి ఏదైనా గోల్డెన్ ఛాన్స్ వస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: