ఏఆర్‌ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘దర్భార్’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ మూవీలో హీారోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్, సాంగ్ ప్రోమోతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  పొంగల్‌ కానుకగా జనవరి 9న విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ టీం.

 

అయితే మూవీ రిలీజ్‌పై ఒక్కసారిగా కొత్త వ‌దంతులు వినిపిస్తున్నాయి అవేంటంటే... నీలిమేఘాలు కమ్ముకున్న‌ట్లు దర్భార్ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. అదేంటి సినిమా ఇంకో  ప‌ది రోజుల్లో కావాలి క‌దా అనుకుంటున్నారా అస‌లు విష‌య‌మేంటో చూద్దాం...లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమకు ఇవ్వాల్సిన రూ. 23. 7 కోట్లు బాకీ  చెల్లించడంలేదన్న కారణంతో మలేషియా చెందిన డిఎమ్‌వై క్రియేషన్స్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. రోబో 2.O , దర్బార్ సినిమాలకు గానూ లైకాకు కొంత ఫైనాన్స్ ఇచ్చినట్టుగా ఆ సంస్థ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. పిటిషన్ పై జనవరి 2 లోపు వివరణ ఇవ్వాలని లైకా నిర్మాణ సంస్థకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మ‌రి ఎందువ‌ల్ల ఇలా జ‌రిగింది అన్న వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

 

ఈ చిత్రంలోని ‘డుమ్ డుమ్’ అంటూ సాగే సాంగ్ రజనీకాంత్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ ఎనర్జిటిక్ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా మకాష్ అజీజ్ పాటను పాడాడు. ఇక లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నారు.సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌ర్ 16 సాయంత్రం 6.30ని.ల‌కి ద‌ర్భార్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మురుగ‌దాస్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాయి. ఈ యాక్ష‌న్ ప్యాక్డ్ ట్రైల‌ర్ అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: