కీరవాణి తెలుగు ఇందస్ట్రీలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకి సంగీతం అందించాడు. రాఘవేంద్రరావుతో కలిసి ఆయన చేసిన సినిమాలన్నీ సంగీత పరంగా బ్లాక్ బస్టర్సే. వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ సినిమాలోనైనా సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేం విషయమో తెలియదు కానీ అదైతే నిజం. ప్రస్తుతం కీరవాణి అంతటి సంగీతాన్ని మళ్ళి రాజమౌళి కోసం చేస్తున్నాడు.
రాజమౌళి చేసిన ప్రతీ సినిమాకి కీరవాణే మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుండి ఇప్పుడు తీసే ఆర్.ఆర్.ఆర్ వరకి అన్ని సినిమాలకి కీరవానే స్వరాలు సమకూర్చారు. అలాంటి కీరవాణి ఒకానొక సందర్భంలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాడట. రాజమౌళి కీరవాణి ల ఉమ్మడి కుటుంబం గురించి అరికీ తెలిసిందే. అయితే ఇప్పుడితే కీరవాణికి ఫ్యామిలీకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.
కానీ ఒకానొక సమయంలో కీరవాణి చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాడట. 2000 ప్రాంతంలో కెరీర్ డల్ అయింది. ఆదాయం తగ్గింది. అప్పుడు తమ కుటుంబం ఎంత ఇబ్బంది పడింది ఒకసారి గుర్తు చేసుకున్నారు. తన కొడుకులు సింహా, కాలభైరవల అరంగేట్ర సినిమా మత్తువదలరాకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న కీరవాణీ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
2000 ప్రాంతంలో తన కెరీర్ బాగా డల్ అయిందని, తమ కుటుంబమంతా అప్పుడు ఇబ్బంది పడ్డామని, ఆ సమయంలో సినిమా అవకాశాలు పెద్దగా లేక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండగా.. సింగపూర్కు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లే ప్రతిపాదన వస్తే అంత డబ్బులు పెట్టుకోలేక ఆగిపోయామని కీరవాణి వెల్లడించాడు. అప్పుడు శ్రీ సింహాకి నాలుగేళ్ళ వయసుంటుందట. ఆ సమయంలో శ్రీ సింహా మిమ్మల్ని నేను సింగపూర్ కి తీసుకెళ్తానని అన్నాడట.ఇప్పుడు శ్రీ సింహాకి మమ్మల్ని సింగపూర్ తీసుకెళ్ళేంత రెమ్యునరేషన్ మైత్రీ మూవీ మెకర్స్ వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నానని చమత్కరించాడు.