టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రకూల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ మూవీతో పరిచయం అయ్యింది.  ఈ మూవీ పెద్దగా హిట్ కాకపోయినా అదృష్టం కొద్ది సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది.  ఆ తర్వాత తెలుగు లో వరుసగా టాప్ హీరోల సరసన నటించింది.  ఒక లెక్కలో చెప్పాలంటే ఐదేళ్ల నుంచి స్టార్ హీరోలు రకూల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు యాడ్స్, మోడలింగ్ చేస్తూ వ్యాపారాలు కూడా చేస్తంది రకూల్.  అయితే రకూల్ ప్రీత్ సింగ్ కి కొంత కాలంగా తెలుగ లో అవకాశాలు తగ్గాయి. ఇటీవల నాగార్జున నటించిన ‘మన్మథుడు2’ లో నటించింది.  కానీ ఈ మూవీ పెద్దగా విజయం అందుకోలేక పోయింది.  పైగా ఈ మూవీలో రకూల్ పాత్రపై కొన్ని విమర్శలు వచ్చాయి.  

 

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది రకూల్.  ఇటీవ‌ల మ‌న్మ‌థుడు 2, దేవ్‌, ఎన్జీకే, దేదే ప్యారేదే, మ‌ర్జావ‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఇందులో కొన్ని మూవీస్ ప్రేక్ష‌కుల‌ని నిరాశ‌ప‌ర‌చాయి.  అయితే 2019 రకూల్ కి అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. దాంతో 2020 అయితే తనకు మంచి సక్సెస్ రావాలనే ఆశతో ఉంది. అయితే ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు వేసుకుంటుంది.  కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో ఉందని టాక్.  తాజాగా రకూల్ ఐదేళ్ల క్రితం నటించిన మూవీ ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది.  

 

జ‌న‌వ‌రి 3న షిమ్లా మిర్చి అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది ర‌కుల్‌. 2015లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తైన‌ప్ప‌టికీ, ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల‌న ఇన్నాళ్ళు విడుద‌ల‌కి నోచుకోలేదు.  ర‌మేష్ సిప్పి ద‌ర్శ‌క‌త్వంలో ‘షిమ్లామిర్చి’ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతుంది.  ఈ మూవీలో రాజ్‌కుమార్ రావు, హేమ‌మాలిని ముఖ్య పాత్ర‌లు పోషించారు.  మరి ఈ మూవీ రకూల్ కి మంచి సక్సెస్ ఇస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: