సినిమాకు కథ  కథాంశం  ఎంత ముఖ్యమో  సినిమాలోని పాటలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో పాటలు ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా కథాంశం బాగా  లేకపోయినా కేవలం పాటలతోనే నెట్టుకొచ్చిన సినిమాలు కూడా మరెన్నో. ఇలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే సంగీతం కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ క్రమంలోనే టాలీవుడ్లోకి కొత్త హీరోలు వచ్చినట్టుగానే కొత్త సంగీత దర్శకులు కూడా ఎంతో మంది వస్తున్నారు. తమదైన సంగీతం తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే ఈ రోజుతో 2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2020 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం . 

 

 

 

 

 ఈ సందర్భంగా 2019 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులని తమ  మ్యూజిక్తో ఉర్రూతలూగించిన టాప్ 3 సంగీత దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

 

 దేవి శ్రీ ప్రసాద్ : ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా  కొనసాగుతున్న స్వరమాంత్రికుడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో ఒక జోష్  ఉంటుంది... దేవీశ్రీ కంపోజ్ చేసిన పాటలు వింటుంటే బాడీ లో ఏదో తెలియని ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఇక ఈ దర్శకుడు ఈ ఏడాది ప్రారంభంలో వచ్చి  మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఎఫ్ 2 సినిమాకి సంగీతం అందించి  ప్రేక్షకులందరినీ అలరించి ... ఆ తర్వాత వినయవిధేయరామ మహర్షి లాంటి స్టార్  హీరోల  సినిమాలకు మ్యూజిక్ అందించి తెలుగు ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ లో సరి కొత్త మ్యూజిక్ ని అందిస్తూ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.

 

 

 

 ఎస్.ఎస్.తమన్ : రొటీన్కు భిన్నంగా తనదైన స్టైల్ లో మ్యూజిక్ ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించాడు సంగీత దర్శకుడు తమన్. ఇక 2019 సంవత్సరంలో అయితే ఈ సంగీత దర్శకుడు  ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అక్కినేని అఖిల్ నటించిన  మిస్టర్ మజ్ను సినిమా కు మ్యూజిక్ అందించాడు తమన్. దీనికి సంబంధించిన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఇక ఆ తర్వాత మజిలీ సినిమాతో మరోసారి తన మ్యూజిక్ తో అద్భుతం చేశాడు ఎస్.ఎస్.తమన్. రీసెంట్ గా వచ్చిన వెంకీ మామ, ప్రతి రోజు పండగే సినిమాల్లో కూడా తనదైన స్టైల్ లో మ్యూజిక్ అందించి 2019లో ఎన్నో సినిమాల్లో  తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుడిగా రికార్డు సాధించాడు. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురం సినిమాలో మ్యూజిక్ అందిస్తూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు తమన్.

 

 

 

 అనిరుద్ రవిచందర్ : టాలీవుడ్ టాప్ దర్శకులైన దేవిశ్రీ ప్రసాద్ ఎస్.ఎస్.తమన్ తర్వాత తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్  రవిచందర్. తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్. టాలీవుడ్ లో మ్యూజిక్ ని కొత్త పుంతలు తొక్కిస్తూ తనదైన స్టైల్లో మ్యూజిక్ అందించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. 2019 సంవత్సరంలో నాని హీరోగా నటించిన మజిలీ సినిమాకు మ్యూజిక్ అందించి   తన మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకుల అందరినీ కట్టిపడేసారు. ఇక తాజాగా ఆమె నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: