‘సుప్రీమ్‌’ తర్వాత 6 వరస పరాజయాలు రావడంతో సాయి ధరమ్ తేజ్ డబల్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోగా మారిపోయాడు. ‘చిత్రలహరి’ మూవీ మెగా మేనల్లుడికి కెరియర్ పరంగా కొద్ది ఊపిరి పోసినా ఒక భారీ హిట్ లేకుంటే అతడు ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అన్న కామెంట్స్ వచ్చాయి. 

ఇలాంటి పరిస్థితులలో సాయి తేజ్ కు ‘ప్రతిరోజు పండగే’ మూవీ ఘన విజయాన్ని ఇచ్చినా ఆమూవీ క్రెడిట్ సాయి తేజ్ కంటే రాశి ఖన్నా ఖాతాలోకి వెళ్లిపోవడం సాయి  తేజ్ ను ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో 'ప్రతి రోజూ పండగే' చూసిన ప్రేక్షకులు అంతా రాశి ఖన్నా ఈ మూవీలో చేసిన ఏంజల్ పాత్రతో అదేవిధంగా ఆమె టిక్ టాక్ మ్యానియాతో కనెక్ట్ అవ్వడంతో ఈ మూవీలో నటించిన సాయి తేజ్ కంటే రాసి ఖన్నాకు విమర్శకుల నుండి మంచి మార్కులు పడుతున్నాయి. 

దీనితో ఈ మూవీ సక్సస్ తరువాత ఒకేసారి రాశి ఖన్నా గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయి టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ దర్శకుడు మారుతికి రావు రమేష్‌కి ఒక రేంజ్‌ వరకు సత్యరాజ్‌ కీ ప్రశంసలు దక్కుతున్నాయి కాని ఎవరు సాయి తేజ్ గురించి మాట్లడుకపోవడం మెగా మేనల్లుడికి షాక్ ఇస్తున్నట్లు టాక్.  

ఈచిత్రం హీరోగా సాయి తేజ్‌ కూడా హిట్‌ సినిమాలో నటించిన క్రెడిట్‌ అయితే దక్కించుకున్నాడు కానీ నటుడిగా ఈచిత్రానికి ఏ విధంగాను ప్లస్‌ కాలేకపోయాడుఅన్న కామెంట్స్ వస్తున్నాయి.  అంతేకాదు సాయి తేజ్ స్థానంలో ఏ హీరో నటించినా ఈసినిమాకు ఇలాంటి విజయం వస్తుంది అని కామెంట్స్ రావడం సాయి తేజ్ కు మరింత షాక్ ఇచ్చినట్లు టాక్. దీనితో ఇప్పటివరకు డజను సినిమాల వరకు చేసినా కానీ నటుడిగా తొలి చిత్రంలో ఎక్కడున్నాడో సాయి తేజ్‌ ఇప్పటికీ అక్కడే ఉన్నాడు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ అతడికి నిరాశను కలిగిస్తోంది. వ్యక్తిగతంగా టిక్ టాక్ వీడియోస్ అంటే ఇష్టంలేని రాశి ఖన్నా ఏంజెల్ గా మార్కులు కొట్టేస్తే నటుడిగా మరో మెట్టు ఎక్కాలి అని భావించిన సాయి తేజ్ కు ఈ మూవీలో పాస్ మార్కులు రావడం యాధృశ్చికం..  

మరింత సమాచారం తెలుసుకోండి: