బాలీవుడ్ అగ్ర కథానాయకులలో సల్మాన్ ఖాన్ ఒకరు. తనజీవిత కాలంలో ఎన్నో ఎత్తుపలాలను చూసిన నటుడు సల్మాన్ ఖాన్.. ఇక తనదయిన యాక్టింగ్ తో ఎన్నో రికార్డ్స్ కైవసం చేసుకున్న సల్మాన్ చిత్రం ఏదైనా వస్తుందంటేనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పదతాయి. అటూ బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆయన క్రేజ్ కు ఢోకా లేదు. ఇకపోతే సల్మాన్ ఖాన్ 1989లో వచ్చిన 'బీవీ హో తో ఐసీ' చిత్రంతో సహాయనటుడిగా సినిమా రంగానికి పరిచయం అయ్యారు.
ఆ తర్వాత 1989లో సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అప్పట్లో 50 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ కు యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నారు. ఇకపోతే సల్మాన్ కు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా పతాక శీర్షికల్లోనే ఉంటుంది.
ఈ క్రమంలో తాజాగా ఓ ట్వీట్ ద్వారా సల్మన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అదేమంటే ఈ మధ్యనే తన పుట్టినరోజు జరుపుకున్న సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన పుట్టినరోజు సందర్భంగా ముంబయిలో ఉన్న సల్మాన్ ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి కేరింతలు కొట్టారు. అదే సయమంలో ఫ్యాన్స్కు సల్మాన్ ఇంటి పై నుంచే ధన్యవాదాలు తెలిపారు.
ఆ సమయంలో సల్మాన్ ఖాన్ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా సల్మాన్ఖాన్ నటించిన 'దబాంగ్-3' ఇటీవలే మూడు భాషల్లో విడుదలై ఆకట్టు కుంటోంది. ప్రస్తుతం ఈ కండలవీరుడు ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2020 మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు..