టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకప్పుడు నటి ఖుష్బూ అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టాలీవుడ్ 80వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ తెలుగు లో కన్న తమిళంలో ఎక్కువ పేరు సంపాదించింది. బాలీవుడ్ నటి అయిన ఖుష్బూ తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ రజిని,కమల్ హాసన్ లతో ఎక్కువ సినిమాల్లో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. ఎంతగా అంటే ఆమెకి అక్కడ అభిమానులు 'గుడి' కట్టారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఖుష్బు రాజకీయాల్లో సైతం తన మార్క్ చాటుకుంటున్నారు. ఆ మద్య త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీలో ముఖ్యభూమిక పోషించింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు సి. సుందర్ ని వివాహం చేసుకున్నారు ఖుష్బూ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలుగులో నాకు మంచి గుర్తింపు వచ్చింది.. ఆ తర్వాత నేను కోలీవుడ్ కి వెళ్లాను. అక్కడ తమిళంలో ప్రభు జోడీగా నేను 'చిన్నతంబి' (చంటి) చేశాను. ఆ సినిమా తరువాత అభిమానులు నాకు 'తిరుచ్చి'లో 'గుడి' కట్టారు. అప్పట్లో ఇలా సోషల్ మీడియా లేదని.. ఏవైనా మూవీ వార్తలు చూడాలంటే పేపర్ లేదా ఏదైనా మ్యాగ్జన్స్ చదవాలని అన్నారు. నాకు నా అభిమానులు గడి కట్టించాని తెలియగానే కన్నీళ్లు వచ్చాయని.. ఆ తర్వాత నా బాధ్యత కూడా పెరిగిందని భావించానని అన్నారు. నా కటౌట్ లకు పాలాభిషేకాలు చేయడం .. తెరపైకి డబ్బులు విసరడం నాకు నచ్చదు. నా అభిమానులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటాను.
ఒకసారి పొలాచ్చిలో షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో నేను ఏనుగు ఎక్కే షూట్ జరుగుతంది. షూటింగ్ చూడటానికి ఓ వ్యక్తి వచ్చి నన్ను దారుణంగా కామెంట్ చేశాడు.. ఆ సమయంలో నా భర్త సుందర్ అతన్ని వారించాడు.. కానీ మద్యం మత్తులో అతడు రెచ్చిపోయాడు. దాంతో అతన్ని సుందర్ వెంటపడి మరీ కొట్టాడు. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు ఖుష్బూ.