సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సర్సన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

 

మహేష్ కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో డ్యాన్స్ కూడా ఇరగదీశాడని తెలుస్తుంది. సినిమా హైలెట్స్ లో మహేష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒక హైలెట్ అని అన్నారు సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మాతల్లో ఒకరైన అనీల్ సుంకర. మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి సెట్ లో ఉన్న మాకే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయామని అన్నారు అనీల్ సుంకర.   

 

రీసెంట్ గా వచ్చిన డాంగ్ డాంగ్ సాంగ్ లోనే మహేష్ డ్యాన్స్ అదరగొట్టాడని అనిపించింది. ఇక ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతున్న ఆ మైండ్ బ్లాంక్ డ్యాన్స్ లో మహేష్ ఎలా కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. అనీల్ సుంకర మాత్రం మహేష్ ఫ్యాన్స్ మాత్రం సీట్లలో కూర్చోరని చెప్పాడు మహేష్ సినిమా అంటే వెళ్తిగా ఫీలయ్యే డ్యాన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరు సంతృప్తినిచ్చేలా ఉంది.

 

మహేష్ కూడా అనీల్ రావిపుడి మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు. సినిమా అవుట్ పుట్ విషయంలో మహేష్ ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. జనవరి 11న రిలీజ్ కానున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న రిలీజ్ అవుతుంది.. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: